Nara Lokesh: లోకేష్ కీలక సూచనలు.. అధ్యయనానికి టీడీపీ కమిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తెలుగు దేశం పార్టీ.. మళ్లీ పూర్వ వైభవం కోసం ప్లాన్ చేస్తోంది.. ఇప్పటికే ప్రభుత్వ విధానాలను, వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తోంది.. ఇక, తెలుగు దేశం పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.. టీడీపీలోకి యంగ్ బ్లడ్ పై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక సూచనలు చేశారు.. పార్టీలో యువతకు ప్రాతినిధ్యంపై టీడీపీ పొలిట్ బ్యూరో భేటీలో చర్చ లేవనెత్తారు లోకేష్.. దీంతో, ఆయన సూచనలపై సమగ్ర అధ్యయననానికి కమిటీ ఏర్పాటు చేయాలని తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది… యువతకు ప్రాధాన్యం, యువత భాగస్వామ్యం పెరిగేలా పార్టీ తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వనుంది ఆ కమిటీ.. వచ్చే పొలిట్ బ్యూరో సమావేశం నాటికి పక్కా కార్యాచరణతో వెళ్లేలా లోకేష్ ప్రణాళికలు రచిస్తున్నారట.
పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా సంస్కరణలే కాదు.. యువతకు కీలక భాగస్వామ్యం ఇవ్వాలని నారా లోకేష్ తన వాదనను పొలిట్బ్యూరో సమావేశంలో వినిపించారు.. పార్టీలో యువతకు ప్రాధాన్యంపై స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు.. పార్టీలో నూతనత్వం, యువ రక్తం తెచ్చేందుకు కసరత్తును వేగంగా చేపట్టాలని పేర్కొన్నారు. లోకేష్ వాదనలకు అంగీకరించిన టీడీపీ పొలిట్బ్యూరో వెంటనే పూర్తిస్థాయిలో అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేసింది.. కాగా, మహానాడుతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపే ప్రయత్నం ఇప్పటికే జరిగింది.. ముఖ్యంగా యువతకు టీడీపీ నుంచి పిలుపొచ్చింది. పార్టీలో సీనియర్లను పక్కనపెట్టి, దాదాపు 40 శాతం వరకు యువతకు టికెట్లు ఇచ్చి అసెంబ్లీ బరిలోకి దించాలన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్ణయాన్ని సీనియర్ నేతలు సైతం ప్రశంసలు కురిపించారు.. మరోవైపు వరుసగా మూడు పర్యాయాలు ఎన్నికల్లో ఓడిపోయిన నేతలకు సైతం టీడీపీ టికెట్ ఇచ్చేది లేదని సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు లోకేష్. పార్టీలో పదవులు రెండు సార్లు దక్కుతాయని, యువతకు అవకాశం ఇస్తూ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని లోకేష్ మహానాడులో స్పష్టం చేశారు… ఇప్పుడు దానిని ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అవుతోంది తెలుగుదేశం పార్టీ.
Also Read
- Heatwave Alert: భగభగమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. మరో మూడు రోజుల పాటు ఇదే తప్పదు సుమీ..!
- Nandamuri Balakrishna: ఏపీని సినీ పరిశ్రమకు రాజధానిగా తీర్చిదిద్దుతాం..!
- Satya Kumar Yadav: 'ఎబోలా'పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు ఆదేశాలు జారీ.!
- Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
తాజావార్తలు
-
RR VS MI: ప్లే ఆఫ్స్లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్.. మే 27న SRH తో ఎలిమినేటర్ మ్యాచ్..
-
Karnataka Tragedy: కర్ణాటకలో ఘోర విషాదం.. ముత్యపుచిప్పల కోసం మృత్యు ఒడిలోకి! నదిలో మునిగి ఎనిమిది మంది మృతి..
-
Viral: ఫుడ్ పాయిజనింగ్కు రూ. 65 వేల బిల్లు.. నెట్టింట వైరల్గా మారిన ఆ హాస్పిటల్ దోపిడీ..
-
Yuvraj Singh: మీ అందరినీ చెప్పులతో కొట్టాల్సిన సమయం వచ్చేసింది.. పంజాబ్ ఆటగాళ్లపై విరుచుకుపడ్డ యూవీ.!
-
Rohit Sharma: ఐపీఎల్ చరిత్రలోనే.. చెత్త రికార్డు మూట గట్టుకున్న రోహిత్ శర్మ..
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!