NTV Telugu Site icon

డ్రగ్స్ బిగ్ బాస్ ఎవరూ అంటే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు?

డ్రగ్స్‌ వ్యవహారంలో కూడా ఆంధ్రప్రదేశ్‌లో పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది… తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా కౌంటర్‌ ఇచ్చిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్… డ్రగ్స్ బిగ్ బాస్ ఎవరూ అంటే బ్రోకర్ సజ్జల ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? అంటూ ప్రశ్నించారు.. మా నాన్న మారిషస్-నేను దుబాయ్ అంటూ బొంబాయి కబుర్లు మాని, డ్రగ్స్ మాఫియా కింగ్ పిన్ జగన్ బినామీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై విచారణ జరపండి అంటూ డిమాండ్‌ చేసిన ఆయన.. నలభై ఏళ్ల మా నాన్న రాజకీయ జీవితంలో ఒక్క కేసైనా ఉందా? అని ప్రశ్నించారు. మీ రెండున్నరేళ్ల పాలనలో నాపై కక్ష కట్టి మరీ పెట్టిన ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు తప్పించి, మీరే ఆరోపించిన వాటిలో ఒక్క రూపాయి అయినా అవినీతైనా నిరూపించగలిగారా? అంటూ సవాల్‌ చేశారు.

ఇక, సీబీఐ, ఈడీ, మనీల్యాండరింగ్, ఐటి కేసులతో ఆర్థిక ఉగ్రవాదైన జగన్ ఇప్పుడు తన నేర సామ్రాజ్యాన్ని డ్రగ్స్ దందా వరకూ విస్తరించారంటూ సంచలన ఆరోపణలు చేసిన నారా లోకేష్‌.. రూ. 72 వేల కోట్ల హెరాయిన్ దిగుమతిపై డీఆర్ఐ కేసులోనూ జగన్ నిందితుడేనని విమర్శించారు.. ప్రజల ఆరోగ్యం కాపాడే పాలు, పెరుగు, మజ్జిగ , నెయ్యి వ్యాపారం మాది.. కానీ, జనం ప్రాణాలు తీసి.. లక్షల కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చే హెరాయిన్, గంజాయి, ప్రాణాంతక మద్యం మాఫియాలు మీవి అని ఆరోపించారు.. సజ్జల విమర్శలకు కౌంటర్ ఇస్తూ.. ఎస్‌.. నేను దుబాయ్ లో నా కుటుంబ సభ్యులతో వున్నా.. నా పర్యటనపైనా, మీ డ్రగ్స్ బిగ్ బాస్ బినామీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సీక్రెట్ గా వెళ్లిన డ్రగ్స్ హెవెన్ ఐవరీ కోస్ట్ టూర్ పైనా కేంద్ర సంస్థల దర్యాప్తుకి సిద్ధమా? సజ్జలా అంటూ సవాల్‌ విసిరారు. సజ్జల తీరు డ్రగ్స్ దొంగే.. దొంగా..దొంగా అని అరిచినట్టుంది ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్.