Karthika Mahotsavam 2024: శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు.. పెరిగిన రద్దీ
- శ్రీశైలంలో కార్తీక మసోత్సవాలు ఘనంగా ప్రారంభం..
- నేటి నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మసోత్సవాలు..
- వేకువజామనే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karthika Mahotsavam 2024: ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైలం మల్లికార్జునస్వామి క్షేత్రంలో కార్తీక మసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.. నేటి నుండి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కాగా.. డిసెంబర్ 1 వతేదీ వరకు జరగనున్నాయి.. కార్తీక మసోత్సవాల ప్రారంభంలో భాగంగా వేకువజామనే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయ ముందు ఉన్న గంగాధర మండపం వద్ద అలానే క్షేత్రంలో పలు చోట్ల కార్తీక దీపాలు వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు.. అనంతరం శ్రీస్వామి అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్స్ క్యూ కంపార్టుమెంట్ లలో ఓం:నమశ్శివాయ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ బారులు తీరారు..
Read Also: Israel–Hamas war: హమాస్ చివరి కీలక నేత హతం.. ధృవీకరించిన ఇజ్రాయెల్
Also Read
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
మరోవైపు.. క్యూ కంపార్టుమెంట్ లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా శ్రీశైలం ఆలయం ఇంఛార్జ్ ఈవో చంద్రశేఖర్ రెడ్డి ముందస్తు ఏర్పాట్లు చేశారు. రద్దీ దృష్ట్యా భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. దీనితో శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు ఒక గంట సమయం పడుతుంది. అలానే క్యూలైన్స్ లో వేచి వుండే భక్తులకు అల్పాహారం, బిస్కెట్లు, పాలు, మంచినీరు అందిస్తున్నారు.. మరోవైపు.. దేవస్థానం ఉద్యోగులకు కార్తీకమాసం ప్రత్యేక విధులు కూడా కేటాయించారు. అయితే నేడు కార్తీకమాసం మొదటి రోజు అలానే వారాంతం కావడంతో భక్తులు రద్దీ స్వల్పంగా పెరిగింది. కార్తీకమాసంలో ప్రభుత్వ సెలవులు, కార్తీకపౌర్ణమి, శని, ఆది, సోమ, ఏకాదశి రోజులలో శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే ఉంటుందని మిగిలిన సాధారణ రోజులలో రోజుకు మూడు విడతలుగా సామూహిక అభిషేకాలు, స్పర్శ దర్శనాలు అందుబాటులో ఉంచామని భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్స్ పొందవచ్చని ఇంఛార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!