Srisailam: శ్రీశైలంలో సంప్రదాయబద్ధంగా గిరిప్రదక్షిణ, లక్ష కుంకుమార్చన
- శ్రీశైలంలో పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ...
- గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు, అధికారులు, సిబ్బంది..
- అనంతరం లక్షకుంకుమార్చన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో పౌర్ణమి సందర్భంగా గిరిప్రదక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.. ఈవో శ్రీన్నవాసరవు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.. శ్రీసామి అమ్మవారి మహా మంగళహారతుల అనంతరం శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను పల్లకిలో ఎక్కించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను ధర్మప్రచార రథంలో ఊరేగింపుగా గిరిప్రదక్షణ కార్యక్రమాన్ని ఆలయ ఈవో శ్రీనివాసరావు, అర్చుకులు ప్రారంభించారు.. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆలయం రాజగోపురం నుంచి ప్రారంభమై.. గంగాధర మండపం, ఆంకాళమ్మ ఆలయం, నందిమండపం, గంగాసదనం, వీరభద్రస్వామి ఆలయం, పంచమఠాలు, మల్లన్న కన్నీరు పుష్కరిణి వద్దకు చేరుకుని తిరిగి నంది మండపం మీదుగా ఆలయ మహాద్వారం చేరుకోవడంతో శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమం ముగిసింది..
Read Also: Jaggareddy: హోలీ వేడుకల్లో డప్పు కొట్టి డ్యాన్స్ చేసిన జగ్గారెడ్డి
Also Read
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా దిరిగిప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు.. ఈ గిరి ప్రదక్షిణలో వందలాది మంది భక్తులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.. గిరి ప్రదక్షిణ ముగిసిన అనంతరం అమ్మవారి ఆలయంలో వైశాఖ శుద్ధ పౌర్ణమి కావడంతో లక్షకుంకుమార్చన నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో భక్తులు పరోక్షసేవగా కూడా పాల్గొనే అవకాశం దేవస్థానం కల్పించడంతో.. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ నుంచి భక్తులు పాల్గొన్నారు.. ఈ లక్ష కుంకుమార్చనలో ముందుగా పూజాసంకల్పం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజను నిర్వహించి అర్చకులు, వేదపండితులు లక్షకుంకుమార్చన జరిపించారు.. ఈ పూజాకైకర్యాలతో ఆలయ ఈవో శ్రీనివాసరావు, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!