Site icon NTV Telugu

Bhuma Akhila Priya: హత్య కేసుల్లో జీవిత ఖైదు పడిన 12 మంది దోషులకు భూమా అఖిల ప్రియ పరామర్శ.. సంచలన వ్యాఖ్యలు

Bhuma Akhila Priya

Bhuma Akhila Priya

Bhuma Akhila Priya: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తాజాగా చింతకుంట హత్య కేసుల్లో జీవిత ఖైదు శిక్షపడిన 12 మంది దోషులను పరామర్శించి, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్శనపై ఆమె రాజకీయ, న్యాయ పరమైన దృక్కోణాలను వెల్లడిస్తూ విమర్శలు గుప్పించారు.. “రేపటి నుండి మా ప్రజలు, ప్రత్యర్థులు, అన్ని పార్టీల నేతలు, మీడియా మిత్రులు మా రాజకీయాల్లో మార్పులు చూడబోతారు” అని తెలిపారు అఖిలప్రియ.. “అతి మంచితనం మంచిది కాదని తెలుసుకున్నాం” అని, రాజకీయాలలో ఎదురైన సవాళ్లను మరియు తప్పులు గురించి పంచుకున్నారు.

Read Also: April Horoscope: ఏప్రిల్ నెలలో ఈ 4 రాశుల వారికి కనకవర్షమే.. మీ రాశి ఉందో లేదో చూసుకోండి!

“చట్టంపై మాకు గౌరవం ఉంది. రాజకీయాల్లో ఎంతో నష్టపోయాం, కేసులు వేయించుకున్నాము, జైలుకు వెళ్లాం” అని తెలిపారు. భూమా అఖిల ప్రియ కోర్ట్ వ్యవస్థపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, “కోర్టుల్లో కొంతమందికి శిక్ష పడుతుంది, కొంతమందికి పడటం లేదు” అని పేర్కొన్నారు. అంతేకాక, శిక్ష పొందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని, న్యాయ పోరాటం కొనసాగిస్తారని పేర్కొన్నారు. “హైకోర్టులో మా వాదనలను బలంగా వినిపించి న్యాయ పోరాటం చేస్తాం. అవసరమైతే సుప్రీంకోర్టు వెళ్తాను, బాధితులకు న్యాయం చేస్తాను” అని భూమా అఖిల ప్రియ స్పష్టం చేశారు.

Exit mobile version