Site icon NTV Telugu

Nandigam Suresh: ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేసిన నందిగం సురేష్..

Nandigama

Nandigama

Nandigam Suresh: అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన మరియమ్మ హత్య కేసులో తనకు రెగ్యులర్‌ బెయిలు మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ మాజీ పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్‌ బుధవారం ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, ఈరోజు (గురువారం) ఈ వ్యాజ్యం ఉన్నత న్యాయస్థానంలో విచారణకు రాబోతుంది. కాగా, 2020 డిసెంబర్‌లో రెండు సామాజిక వర్గాల మధ్య గొడవలు జరిగడంతో.. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్న ఘటనలో మరియమ్మ అనే మహిళ మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అప్పట్లో తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.

Read Also: Chandrababu- Pawan: నేడు హర్యానాకి ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు..

అయితే, ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను 78వ నిందితుడిగా తుళ్లూరు పోలీసులు చేర్చారు. తనకు బెయిలు మంజూరు చేయాలని చేసిన వినతిని గుంటూరు కోర్టు తోసిపుచ్చింది. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టును సురేష్ ఆశ్రయించారు. ఈ కేసులో విచారణ పూర్తి అయ్యిందని, సాక్షులను బెదిరించే ఛాన్స్ లేదని పిటిషన్లో ఆయన వెల్లడించారు. కాగా, నందిగం సురేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందోనని అందరు వేచి చూస్తున్నారు.

Exit mobile version