Venugopala Krishna: పిల్లి సుభాష్కు మంత్రి వేణు కౌంటర్.. ఎవరి ట్రాప్లోనో పడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Venugopala Krishna Strong Counter To Pilli Subhash Chandrabose: 2024 ఎన్నికల్లో రామచంద్రపురం నుంచి వేణుని అభ్యర్థిగా ప్రకటిస్తే తాను మద్దతు ఇవ్వనని పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ట్ర తాజాగా కౌంటర్ ఇచ్చారు. బోస్ ఎవరి ట్రాప్లోనే పడి అలా మాట్లాడుతున్నారని తాను అనుకుంటున్నానని అన్నారు. బోస్తో ఉన్నవాళ్లే ఆయనకు చెడ్డ పేరు తెస్తున్నారని వ్యాఖ్యానించారు. బోస్ అలా మాట్లాడి ఉండకూడదని, అలా మాట్లాడరని తాను అనుకుంటున్నానని చెప్పారు. గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీ ఆయన్ను గౌరవించిందన్నారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చే వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని పరోక్షంగా బోస్ని హెచ్చరించారు. పార్టీ అన్ని విషయాలూ పరిశీలిస్తోందని.. పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యమని చెప్పుకొచ్చారు.
Pawan Kalyan: సీఎం జగన్.. ఈ మూడు ప్రశ్నలకు జవాబు చెప్పండి
Also Read
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
అంతకుముందు ఆత్మీయ సమావేశంలోనూ మంత్రి వేణు కీలక వ్యాఖ్యలు చేశారు. మండలి రద్దు అవ్వదని తెలిసి, బోస్ను మంత్రిగా కంటిన్యూ అవుతావా? అని జగన్ అడిగారన్నారు. అయితే.. తాను రాజ్యసభకు వెళ్తానని బోస్ చెప్పారన్నారు. అనుచరులు వల్లే బోస్కి అపకీర్తి, మచ్చ వస్తోందని ఆరోపించారు. పార్టీకి నష్టం చేసే వాళ్ళని కచ్చితంగా దూరం పెడతానన్నారు. తల్లి లాంటి పార్టీను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. బోస్ ఓడిపోయినప్పటికీ పార్టీ వదల్లేదని.. జగన్ ఆయనకు ఎమ్మెల్సీ, మంత్రి, రాజ్యసభ పదవుల్ని ఇచ్చారని గుర్తు చేశారు. తోట త్రిమూర్తులు, బోస్ ముందే వచ్చే ఎన్నికల్లో వేణు పోటీ చేస్తారని జగన్ చెప్పారన్నారు. తనకు, పిల్లికి, తోట త్రిమూర్తులకు వైఎస్ జగన్ ఎవరికి ఇవ్వాలని బాధ్యతలు వారికి ఇచ్చారన్నారు. తాను కేవలం 2024లోనే కాదు.. 2029, 2034లలో కూడా పోటీ చేస్తానని ఉద్ఘాటించారు.
Cab Driver: క్యాబ్ డ్రైవర్ పాడుపని.. డ్రైవింగ్ చేస్తూ మహిళ కళ్లెదుటే హస్తప్రయోగం
ఇదిలావుండగా.. 2024 ఎన్నికల్లో రామచంద్రపురం నుంచి వేణు అభ్యర్థి అయితే, తాను సమర్థించనని పిల్లి సుభాష్ కుండబద్దలు కొట్టారు. వేణు బరిలో ఉంటే మద్దతిచ్చే ప్రసక్తే లేదన్నారు. తన కుటుంబంలో నుంచే ఎవరో ఒకరు పోటీ చేయాలని క్యాడర్ కోరుతోందని అన్నారు. తనకు క్యాడరే ముఖ్యమని, ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు కూడా సిద్ధమేనని తెలిపారు. వేణు ఆత్మీయ సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదన్నారు. సమయం వచ్చినప్పుడు క్యాడర్ సమాధానం చెప్తుందన్నారు. క్యాడర్ను వదులుకోవడానికి సిద్ధంగా లేనన్నారు. పార్టీకి నష్టమైనా, తప్పడం లేదన్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?