Seediri Appalaraju: కథ, స్క్రీన్ ప్లే అంతా వారిదే.. పవన్ కేవలం రేటు తీసుకున్న యాక్టర్ మాత్రమే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seediri Appalaraju:మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ను టార్గెట్ చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పవన్ ఓ వెర్రిబాగులోడు అంటూ పవన్ కల్యాణ్పై ఫైర్ అయ్యారు.. నారాలోకేష్ యువగళం.. పవన్ యువశక్తి అని పేర్లు పెట్టారంటే.. కథ, స్క్రీన్ ప్లే అంతా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే సిద్ధం అవుతుంది.. పవన్ కల్యాణ్ కేవలం రేటు తీసుకున్న యాక్టర్ మాత్రమే నంటూ సంచలన ఆరోపణలు చేశారు.. పవన్ కల్యాణ్, చద్రబాబు కలవడం వెనుక ప్యాకేజీ మాటలే ఉంటాయి.. తప్ప ప్రజా సమస్యలు వారికి పట్టవని ఆరోపించారు. ఇక, నాదేండ్ల మనోహార్ ఓ పనికిమాలినవ్యక్తి అని విమర్శించారు.. ఉద్దానం ప్రజలకు ఏం కావాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి స్పష్టతవుంది.. కిడ్నీ రోగులకు అన్ని విధాల జగన్ ప్రభుత్వం ఆదుకుందన్న ఆయన.. జగన్ సంకల్పం గురించి మాట్లాడేంత స్థాయి పవన్ కల్యాణ్కు లేదన్నారు.. మత్స్యకారుల భరోసా గురించి మాట్లాడుతున్న పవన్., నాదేండ్ల మనోహార్ కు అసలు అవగాహనేలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో ఎప్పుడూ పరిహారం అందలేని.. మత్స్యకారులు, కిడ్నీరోగులకు అన్నివిధాల తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు.
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
ఇక, మందస మండలం లోహరిబందలో గ్రామస్తులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులతో మంత్రి విడుదల రజినీతో కలిసి సమావేశమైన మంత్రి అప్పలరాజు.. అనంతరం హరిపురం డయాలిసిస్ సెంటర్, పలాస లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కిడ్ని రీసెర్చ్ సెంటర్ నిర్మాణ పనులు పరిశీలించారు.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మన ప్రాంతం పట్ల అనేక వరాలు కురిపించారు.. కిడ్నీ వ్యాధిగ్రస్తుడు జీవితం క్లోజ్ అయిపోయిందనుకున్న పరిస్థితి నుండి ఈ ప్రభుత్వం మనల్ని చూసుకుంటుందని స్థాయికి వచ్చారని.. అక్కడక్కడ చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఎంటో తెలుసుకోడానికి మంత్రిగారు, వైద్యాధికారులు ఇక్కడకి వచ్చారని తెలిపారు.. ఇప్పుడు డయాలసిస్ కి వెయిటింగ్ అనే పరిస్థితి లేదు.. కంటి తుడుపు చర్యగా గత ప్రభుత్వంలో 5, 6 కోట్లతో తాగునీటికి ఏర్పాట్లు చేపట్టారని.. కానీ, ఎక్కడా పనులు జరిగిందే లేదన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!