Seediri Appalaraju: మత్య్సకారుల్ని చంద్రబాబు మోసం చేస్తే.. జగన్ వారికి పెద్ద పీట వేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seediri Appalaraju Fires On Chandrababu Naidu Over Fishermen Issues: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మత్స్యకారులను దారుణంగా మోసం చేశారని మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపణలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని మత్స్యకారులు చంద్రబాబు దగ్గరకు వెళ్తే.. తోలు తీస్తామని బెదిరించారని పేర్కొన్నారు. కానీ.. సీఎం జగన్ మాత్రం మత్స్యకారుల అభివృద్ధికి పెద్ద పీట వేశారన్నారు. మత్స్యకారులను చంద్రబాబు హేళన చేస్తే.. సీఎం జగన్ వారికి పదవులు ఇస్తున్నారన్నారు. మోపిదేవి వెంకటరమణను పార్లమెంట్కు పంపించారని.. అప్పలరాజు అనే తనకు మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు. నలుగురు మత్స్యకారులకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. రాజకీయంగా మత్స్యకారులకు జగన్ పెద్దపీట వేశారని, సీఎం జగన్ వల్లే మత్స్యకారుల జీవితాలు బాగుపడ్డాయని చెప్పారు. వేట విరామ సమయంలో దేశంలో ఎక్కడ కూడా రూ.5000లకు మించి ఇవ్వలేదని.. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే రూ.10 వేలు ఇస్తున్నారని తెలిపారు. ఇదే సమయంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మత్స్యకారుల తోకలు కత్తిరిస్తామని చంద్రబాబు బెదిరించారని ఆరోపించారు. కానీ.. సీఎం జగన్ మాత్రం నాలుగుసార్లు మత్స్యకార భరోసా వేశారని, మత్స్యకారులంటే సీఎం జగన్కు ఎంతో ప్రేమ అని తెలియజేశారు. మత్స్యకారులకు మంత్రి, రాజ్యసభ పదవులు కట్టబెట్టారన్నారు. చంద్రబాబుకు మాత్రం పేదలంటే చులకన అని మండిపడ్డారు.
Peedika Rajanna Dora: టీడీపీ నాయకులకు రాజన్న సవాల్.. ఎంతమంది వచ్చినా నేను రెడీ
Also Read
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
అంతకుముందు.. అమరావతిలో పేదలకు ఇల్లు ఇవ్వకుండా చంద్రబాబు అనేక కుట్రలు చేవారని, కోర్టులో కేసులు కూడా వేశారని మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇస్తే.. బ్యాలెన్స్ తప్పుతుందని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. పేదవారికి సెంట్ స్థలం ఇస్తే సమాధి అంటూ చంద్రబాబు మాట్లాడారని.. అదే సెంట్ స్థలంలో పేదలు చంద్రబాబును పూడ్చి పెడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. తాము కోర్టులో పోరాటం చేసి, అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నామన్నారు. మొన్నటి వరకు కమ్మరావతి ఉండే అమరావతిలో ఇప్పుడు పేదలకు పట్టాలు ఇవ్వడం ద్వారా నిజమైన పండగ జరిగిందని పేర్కొన్నారు. సినిమా క్లైమాక్స్లో హీరో ఎలా విజయం సాధిస్తాడో.. తాము కూడా ఈ ఇళ్ల స్థలాల వ్యవహారంలో గెలుపొందామని పేర్కొన్నారు.
Extramarital Affair: ఆరుగురు పిల్లల తల్లి.. ప్రియుడి మోజులో ఎంత దారుణం చేసిందంటే?
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. ‘ఆరెంజ్ క్యాప్’ విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
-
Nag Ashwin: నిజమైన స్టార్డమ్ అంటే ఇదేనేమో! చెన్నై ఈవెంట్లో వైరల్ అవుతున్న నాగ్ అశ్విన్ వీడియో..
-
Anil Vij: “బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు”.. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
-
Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
-
US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!