Seediri Appalaraju: మత్య్సకారుల్ని చంద్రబాబు మోసం చేస్తే.. జగన్ వారికి పెద్ద పీట వేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seediri Appalaraju Fires On Chandrababu Naidu Over Fishermen Issues: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మత్స్యకారులను దారుణంగా మోసం చేశారని మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపణలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని మత్స్యకారులు చంద్రబాబు దగ్గరకు వెళ్తే.. తోలు తీస్తామని బెదిరించారని పేర్కొన్నారు. కానీ.. సీఎం జగన్ మాత్రం మత్స్యకారుల అభివృద్ధికి పెద్ద పీట వేశారన్నారు. మత్స్యకారులను చంద్రబాబు హేళన చేస్తే.. సీఎం జగన్ వారికి పదవులు ఇస్తున్నారన్నారు. మోపిదేవి వెంకటరమణను పార్లమెంట్కు పంపించారని.. అప్పలరాజు అనే తనకు మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు. నలుగురు మత్స్యకారులకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. రాజకీయంగా మత్స్యకారులకు జగన్ పెద్దపీట వేశారని, సీఎం జగన్ వల్లే మత్స్యకారుల జీవితాలు బాగుపడ్డాయని చెప్పారు. వేట విరామ సమయంలో దేశంలో ఎక్కడ కూడా రూ.5000లకు మించి ఇవ్వలేదని.. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే రూ.10 వేలు ఇస్తున్నారని తెలిపారు. ఇదే సమయంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మత్స్యకారుల తోకలు కత్తిరిస్తామని చంద్రబాబు బెదిరించారని ఆరోపించారు. కానీ.. సీఎం జగన్ మాత్రం నాలుగుసార్లు మత్స్యకార భరోసా వేశారని, మత్స్యకారులంటే సీఎం జగన్కు ఎంతో ప్రేమ అని తెలియజేశారు. మత్స్యకారులకు మంత్రి, రాజ్యసభ పదవులు కట్టబెట్టారన్నారు. చంద్రబాబుకు మాత్రం పేదలంటే చులకన అని మండిపడ్డారు.
Peedika Rajanna Dora: టీడీపీ నాయకులకు రాజన్న సవాల్.. ఎంతమంది వచ్చినా నేను రెడీ
Also Read
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
అంతకుముందు.. అమరావతిలో పేదలకు ఇల్లు ఇవ్వకుండా చంద్రబాబు అనేక కుట్రలు చేవారని, కోర్టులో కేసులు కూడా వేశారని మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇస్తే.. బ్యాలెన్స్ తప్పుతుందని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. పేదవారికి సెంట్ స్థలం ఇస్తే సమాధి అంటూ చంద్రబాబు మాట్లాడారని.. అదే సెంట్ స్థలంలో పేదలు చంద్రబాబును పూడ్చి పెడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. తాము కోర్టులో పోరాటం చేసి, అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నామన్నారు. మొన్నటి వరకు కమ్మరావతి ఉండే అమరావతిలో ఇప్పుడు పేదలకు పట్టాలు ఇవ్వడం ద్వారా నిజమైన పండగ జరిగిందని పేర్కొన్నారు. సినిమా క్లైమాక్స్లో హీరో ఎలా విజయం సాధిస్తాడో.. తాము కూడా ఈ ఇళ్ల స్థలాల వ్యవహారంలో గెలుపొందామని పేర్కొన్నారు.
Extramarital Affair: ఆరుగురు పిల్లల తల్లి.. ప్రియుడి మోజులో ఎంత దారుణం చేసిందంటే?
తాజావార్తలు
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
-
Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
-
Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
-
Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..