మంత్రిగా పదోన్నతి పొందిన ఫైర్బ్రాండ్కు పూలు.. ముళ్లు తప్పవా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యే నుంచి మంత్రిగా పదోన్నతి పొందిన ఫైర్బ్రాండ్కు పూలు.. ముళ్లు తప్పవా? ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్కగా రాజకీయం ఉంటుందా? ఇన్నాళ్లూ ఆమెను ఫ్లవర్గానే చూసిన పార్టీలోని ప్రత్యర్థులకు ఇకపై ఫైర్ చూపిస్తారా?
నగరి వైసీపీలో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారా?
చిత్తూరు జిల్లాలోని వైసీపీ రాజకీయాలు ఒక తీరున ఉంటే.. నగరిలో మరోలా ఉంటాయి. అక్కడ నుంచి వరసగా రెండోసారి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రోజా.. ప్రస్తుతం మంత్రి అయ్యారు. అధికారపార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా.. సొంత నియోజకవర్గంలో అసమ్మతి సెగ ఎలా ఉంటుందో రోజా స్వయంగా చూశారు. అసమ్మతులకు చెక్ పెట్టేందుకు ఎమ్మెల్యేగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించేవి కాదు. పైగా వాళ్లకు పదవులు వచ్చిపడటం రోజా శిబిరానికి అస్సలు మింగుడు పడేది కాదు. వచ్చే ఎన్నికల్లో రోజాను ఓడిస్తామని శపథాలు చేసిన వైసీపీ నాయకులు ఉన్నారు. ఇలాంటి సమయంలో కేబినెట్లో చోటు సంపాదించిన రోజా.. సొంతపార్టీలోని ప్రత్యర్థులపై ఎలాంటి అస్త్రాలు ప్రయోగిస్తారన్నది ప్రస్తుతం ప్రశ్న.
Also Read
- Gudivada Amarnath: హోంమంత్రి అనితపై మాజీ మంత్రి ఘాటు విమర్శలు.. ఆమె 'మేకప్ మంత్రి'..!
- Sajjala Ramakrishna Reddy: రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం బయటపడింది.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్..!
- Minister Vasamsetti Subhash: కార్మికుల కోసం సర్కార్ కీలక నిర్ణయం.. అంతా ఒకే దగ్గర..!
- Kesineni Nani vs Kesineni Chinni: కేశినేని బ్రదర్స్ మధ్య మళ్లీ ముదిరిన వార్.. ఎంపీ చిన్నిపై ఈడీకి నాని ఫిర్యాదు
రోజాపై ఓపెన్గానే అసమ్మతి నేతల విమర్శలు
టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన రోజా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా.. 2014లో పార్టీ ప్రతిపక్షానికే పరిమితమైంది. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో తొలి కేబినెట్లోనే చోటు ఆశించారు. సామాజిక సమీకరణాలు.. రాజకీయ అవసరాల కారణంగా రోజాకు ఛాన్స్ దక్కలేదు. మూడేళ్లు వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు మంత్రి అయ్యారు రోజా. ఈ మూడేళ్ల కాలంలో నగరిలో తీవ్రస్థాయిలో అసమ్మతిని ఎదుర్కొన్నారు. రోజా వ్యతిరేక వర్గానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామిల ఆశీసులు ఉండటంతో ఏం చేయలేకపోయేవారు. ఇదే సమయంలో రోజా సొంతపార్టీ ఎమ్మెల్యే అయినా అసమ్మతి నేతలు ఓపెన్గానే విమర్శలు.. ఆరోపణలు చేసేవాళ్లు.
వచ్చే ఎన్నికల్లో రోజా ఎలా గెలుస్తారో చూస్తామని పార్టీలోని ప్రత్యర్థుల సవాళ్లు
పంచాయతీ, మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమయంలో నగరి వైసీపీలో విభేదాలు ఓ రేంజ్లో సాగాయి. ఒకానొక సమయంలో రోజాపై ఆమె వ్యతిరేక వర్గంగా భావించే అమ్ములు బ్యాచ్ దాడిచేసిన ఘటనలూ ఉన్నాయి. కేజే కుమార్, శ్రీశైలం ఆలయ ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి వచ్చే ఎన్నికల్లో రోజా ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తారో చూస్తామని సవాళ్లు కూడా చేశారు. సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల సమయంలో రెండు వర్గాలు సై అంటే సై అనుకున్నాయి. సమస్య సర్దుబాటు కోసం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పలుమార్లు ఫిర్యాదు చేశారు రోజా. తాడేపల్లి వెళ్లి ప్రత్యర్థి వర్గంపై చర్యలు తీసుకోవాలని కోరినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో కొన్నాళ్లుగా సైలెంట్ అయ్యారు రోజా.
మంత్రిగా నగరి వైసీపీలో పట్టు బిగిస్తారా?
కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై చర్చ మొదలైన సమయంలో.. రోజా అనుకూల వర్గం ఒక్కసారిగా దూకుడు పెంచింది. రోజా మంత్రి అయితే నగరిలో లెక్కలు మారతాయని పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు హోరెత్తించారు. అయితే రోజాకు కేబినెట్లో చోటు దక్కదని ఆమె వ్యతిరేక వర్గం లెక్కలేసుకుందట. కానీ.. చూస్తుండగానే రోజా మినిస్టర్ అయ్యారు. నగరిలో ఆమె వ్యతిరేకవర్గం డీలా పడిందట. మారిన పరిస్థితులతో రోజాతో సై అనాలా.. లేక సంధికి వెళ్లాలా అనే చర్చ జరిగిందట. పైగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పార్టీలోని ప్రత్యర్థులపై ఓ రేంజ్లో విరుచుకుపడిన రోజా.. ఇప్పుడు మంత్రిగా ఇప్పుడేం చేస్తారన్నది ప్రశ్న. అలాగే మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని నగరిలో రోజా పట్టు పెంచుకోవచ్చని అనుకుంటున్నారట. అందుకే నగరి వైసీపీ రాజకీయాలు.. మంత్రిగా రోజా వేసే ఎత్తుగడలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి పార్టీ శ్రేణులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Blood Donate: రక్తదానం చేస్తే శరీరం బలహీనపడుతుందా..? డాక్టర్లు చెబుతున్న అసలు నిజం ఇదే..
-
APL 2026లో భోణీ కొట్టిన విజయవాడ సన్షైనర్స్.. కాకినాడ పై సూపర్ విక్టరీ
-
Cooking Hacks: ఇల్లాళ్లకు స్మార్ట్ హెల్ప్.. ఈ వంటింటి చిట్కాలు తెలిస్తే మీ పనులు నిమిషాల్లో అయిపోతాయి!
-
IND vs AFG ODI: టీమిండియాకు బిగ్ షాక్.. సిరీస్ మొత్తానికి స్టార్ ఆటగాళ్లు దూరం..
-
Donald Trump: భారత నౌకలపై డ్రోన్ దాడి.. ఇరాన్పై ట్రంప్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!