Peddi Reddy: మేం చేసింది ఫోన్ ట్యాపింగ్ కాదు.. ఫోన్ ట్రాకింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో టీడీపీ నేత నారాయణ అరెస్ట్ అంశం మరో వివాదానికి దారి తీసింది. టెన్త్ ప్రశ్నపత్రాల మాల్ ప్రాక్టీస్ కేసుల విచారణ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజ్ విషయంలో నిందితులను ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తాము అదుపులోకి తీసుకున్నామని మంత్రి పెద్దిరెడ్డి ప్రకటించడంతో టీడీపీ తీవ్ర అభ్యంతరం చెప్తోంది. ఫోన్ ట్యాపింగ్ నేరమని.. ఈ విషయంలో సీఎం జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఫోన్ ట్యాపింగ్ వివాదంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరణ ఇచ్చారు.
ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పలేదని.. ఫోన్లు ట్రాకింగ్ చేశారని చెప్పానని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఫోన్లు ట్యాపింగ్ చేయడమనేది క్రైం అనేది అందరికీ తెలుసన్నారు. పేపర్ లీకేజీ కేసులో దాదాపు 60 మందికి పైగా నిందితులను పట్టుకున్నారని.. ఈ క్రమంలో ఎవరెవరు ఎవరితో మాట్లాడారో ట్రాక్ చేశారని వివరణ ఇచ్చారు. ఆ విషయమే తాను చెప్పానన్నారు.
Also Read
- Ganesh Idol Protest: 'వినాయకుడి'తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
- Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
- Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
- OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
టీడీపీ అధినేత చంద్రబాబు వయసుకు తగ్గట్లుగా ఆలోచనతో మాట్లాడటం లేదని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడాన్ని చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని.. మీటర్లు బిగిస్తే రైతుల గొంతులకు ఉరితాడు బిగించినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారని మండిపడ్డారు. అయితే పారదర్శకత కోసమే వ్యవసాయ పంపు సెట్లకు ప్రభుత్వం మీటర్లు బిగిస్తోందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఈ నెలాఖరులోగా రైతుల పేరిట అకౌంట్లు ఓపెన్ చేసి అనుసంధానం చేస్తారన్నారు. వంద శాతం కరెంటు బిల్లుల మొత్తాన్ని రైతుల అకౌంట్లో ప్రభుత్వం జమ చేస్తుందని పేర్కొన్నారు. రైతులే నేరుగా డిస్కంలకు విద్యుత్ బిల్లులు కడతారన్నారు. మీటర్లు సక్సెస్ అయితే రైతులు తనకు ఓట్లేయరని చంద్రబాబు భావిస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. రైతులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని.. చంద్రబాబు భాషను తాను మాట్లాడలేనన్నారు. చంద్రబాబు ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. 14 ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా పని చేసిన చంద్రబాబు ఎక్కడా ఒక్క ప్రాజెక్టు కట్టలేదని పెద్దిరెడ్డి విమర్శించారు.
తాజావార్తలు
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
-
Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్పింగ్ సాయం.. ట్రంప్కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!