Kottu Satyanarayana: చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం.. తండ్రి బ్రోకర్.. కొడుకు జోకర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో రాజకీయం మంచి రంజూ మీద ఉంది. ఛాన్స్ దొరికినప్పుడల్లా.. అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే, తాజాగా చంద్రబాబు నాయుడికి ఐటీ నోటీసులు ఇచ్చారనే వార్తలపై వైసీపీ పార్టీ నేతలు ఆయనను టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. బాబు-కొడుకుల అరెస్ట్ ఎలా జరుగుతుందనే చర్చ ప్రస్తుతం జరుగుతోందన్నారు. తండ్రి బ్రోకర్.. కొడుకు జోకర్.. చంద్రబాబు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని ఐటీ శాఖ తేల్చేసింది అని మంత్రి కొట్టు పేర్కొన్నారు.
Read Also: Uttar Pradesh: పెళ్లి కావడం లేదని శివలింగాన్ని దొంగలించిన ఓ వ్యక్తి
Also Read
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
అమరావతిని చంద్రబాబు తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కేంద్రంగా చేసుకున్నాడు అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఐటీ నోటీసుల ద్వారా బయట పడింది అవగింజంత.. చంద్రబాబు హయాంలో వేల కోట్లు నామినేషన్ పద్దతిన ఇచ్చేశాడు.. చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం.. సింగపూర్ మంత్రి ఈశ్వరనుతో ఉన్న లింకులన్నీ బయటపడ్డాయని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు.. నారా లోకేష్ ను ఆంబోతులా రోడ్ మీదకు వదిలేశారు.. లోకేష్ పాదయాత్ర తర్వాత టీడీపీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతోందన్నాడు. డబ్బులు నొక్కేసే విషయంలో మాత్రం బాబు – కొడుకులు పోటీ పడుతున్నారు అని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.
Read Also: Minister KTR : తెలంగాణకు మరో భారీ పెట్టుబడి
ఇండియా పేరు మార్పుపై మంత్రి కొట్టు సత్యనారాణ సంచలన కామెంట్స్ చేశారు. ప్రతిపక్షాలు ఇండియా అని పేరు పెట్టుకున్నారని భారత్ అనే పేరు పెడుతున్నారని ఊహాగానాలు వస్తున్నాయి.. ఏవో ఊహాగానాలు వస్తున్నాయి.. మేమేం చెబుతాం.. భారత్ అని పేరు మార్చినంత మాత్రాన బయట వాళ్లు ఇండియా అని పిలకుండా ఉంటారా..? అని ఆయన ప్రశ్నించారు. మేం ఇండియాలోనూ లేం.. ఎన్డీఏలో లేమని మంత్రి కొట్టు సత్యనారాయణ తేల్చి చెప్పారు.
Read Also: Purandeshwari: తెలుగు భాష అంతరించిపోయే దశలో ఉంది
దుర్గ గుడిలో, శ్రీశైలంలో సుమారు రూ. 400 కోట్ల అంచనాలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. విజయవాడ కనక దుర్గమ్మ ఆలయం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం.. రూపొందించిన ప్లాన్ ప్రకారం టెండర్ల ప్రక్రియను ప్రారంభించాం.. ప్రసాదం పోటు, అన్న దానం బిల్డింగ్, శివాలయం, రాక్ మిటిగేషన్, స్కాడా వంటి పనులు చేపడుతున్నామన్నారు. ప్రస్తుతం దుర్గమ్మ ఆలయం ఉన్న ఘాట్ రోడ్డు వాస్తు ప్రకారం ఉండకూడదని అంటున్నారు.. నైరుతి వైపు నుంచి రాకపోకలు సరి కాదనేది వాస్తు నిపుణులు తెలిపారని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!