Minister Karumuri Nageswara Rao: వినియోగదారులను మోసం చేస్తే అంతే..! తొలిసారి రూ.10 లక్షలు, రెండోసారి రూ.50 లక్షల ఫైన్, ఐదేళ్ల జైలు శిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎక్కడైనా వినియోగదారులను మోసం చేస్తే కఠిన శిక్షలు, భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు.. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో వినియోగదారుడు మోసపోయిన ప్రాంతానికే వెళ్లి ఫిర్యాదు చేయాల్సి వచ్చేది.. కానీ, ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా ఫిర్యాదు చేయవచ్చు అన్నారు.. ఆన్లైన్ ద్వారా కూడా వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించిన ఆయన.. టీ పొడిలో కల్తీ, కందిపప్పుకు రంగు వేయడం, పెట్రోల్ కల్తీ చేయడం వంటివి జరిగితే లీగల్ మెట్రాలజీ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.. ఇక, ఇటీవల మాల్స్ పై దాడులు జరిపి 194, బంగారం షాపులపై తనిఖీలు చేసి 94, పెట్రోల్ బంకులపై 90, ఎరువుల షాపులపై తనిఖీలు జరిపి 360కేసులు నమోదు చేశామని వెల్లడించారు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
ఇక, వినియోగదారులను మోసం చేస్తే జైలు శిక్షతో పాటు.. భారీ జరిమానా తప్పదని హెచ్చరించారు మంత్రి నాగేశ్వరరావు.. మొదటిసారి తనిఖీల్లో పట్టుబడితే సంవత్సరం జైలు శిక్ష, పది లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నామని తెలిపారు. రెండు సార్లు పట్టుబడితే 50 లక్షల రూపాయల జరిమానాతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నామని గుర్తుచేశారు.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినియోగదారుల సంక్షేమ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నామని.. వినియోగదారులకు ఏ రకంగా నష్టం కలిగించినా చర్యలు తప్పవని హెచ్చరించారు పౌర సరఫరాల శాఖ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు.
తాజావార్తలు
-
Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
-
Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
-
Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
-
మనం రోడ్డుపై చూసి వదిలేసే ‘బిచ్చగాళ్ల’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
-
Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!