RIP Goutham Reddy: ఢిల్లీలో గౌతమ్ రెడ్డి సంతాపసభ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు పొందిన అజాతశత్రువు దివంగత ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి సంతాప సభ ఢిల్లీలో జరిగింది. గౌతమ్ రెడ్జి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఏపీ భవన్ అధికారులు.
తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు మంత్రి బొత్స సత్యనారాయణ. గౌతమి రెడ్డి మరణం వార్త అబధ్దం కావాలని కోరుకున్నాను. ఎప్పుడూ నవ్వుతూ ఉండే మనిషి ఇక లేరు. గౌతమ్ రెడ్డి వ్యక్తిత్వాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి, కుటుంబ సభ్యులుకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలి. మా మంత్రివర్గంలో నెంబర్ వన్ వ్యక్తి గౌతమ్ రెడ్డి అన్నారు మంత్రి బొత్స.
Also Read
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
- AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
మంత్రితో పాటు నివాళులు అర్పించారు ఎంపీలు సత్యవతి, రెడ్డప్ప, రంగయ్య,మాధవ్, ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్, ఏపీ భవన్ సిబ్బంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మేకపాటి కుటుంబం, గౌతమ్ రెడ్డి చేసిన కృషి అనన్య సామాన్యం అన్నారు ఎంపీ గోరంట్ల మాధవ్. ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ అత్యంత క్రమశిక్షణ , ఎనర్జీ కలిగిన నాయకుడు గౌతమ్ రెడ్డి, పాలిటెక్నిక్, ఐటిఐ లను ఇంటిగ్రేట్ చేయాలన్న ఆలోచన చేశారన్నారు. ఆయనతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు ప్రవీణ్ ప్రకాష్. గౌతమ్ రెడ్డి మృతి అత్యంత దురదృష్టకరం, చిన్న పరిశ్రమల బాగుకోసం పరితపించిన వ్యక్తి అన్నారు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్.
విధిరాతకు ఎవరైనా తలవంచకు తప్పదు. ఇటీవలే 5 వేల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చారు. గొప్ప సమర్ధుడైన నాయకుడు. భగవంతుడు మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నారు ఎంపీ రెడ్డప్ప. గౌతమి రెడ్డి లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నాను. 11 ఏళ్లు గా పరిచయం. నన్ను ఓ తమ్ముడిలా పలు అంశాల్లో మార్గదర్శకం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్జి పట్ల అత్యంత అభిమానాలతో, గొప్ప సహచరుడుగా వ్యవహరించారు. తిరుపతిలో పలు ప్రాజెక్టులు కార్యరూపం దాల్చడంలో గౌతమి రెడ్డి నాకు తోడుగా నిలిచారని ఆవేదనకు లోనయ్యారు డా.ఎంపీ గురుమూర్తి.
ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ ఈ వార్త నిజంకాకుండా ఉంటే బాగుంటుందని భావించాను. నిగర్వి, సౌమ్యుడు, సమర్ధుడు అయున గౌతమి రెడ్డిని కోల్పోవడం చాలా బాధాకరం. కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నా అని నివాళులర్పించారు. ఉజ్వల భవిష్యత్ ఉన్న సోదరుడుని కోల్పోవడం చాలా దురదృష్టకరం. మృధు స్వభావి, సమర్ధులైన గౌతమి రెడ్డి మరణం రాష్ట్రానికి తీరని లోటు. కుటుంబ సభ్యులకు సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నా అన్నారు ఎంపీ సత్యవతి.
తాజావార్తలు
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!