RIP Goutham Reddy: ఢిల్లీలో గౌతమ్ రెడ్డి సంతాపసభ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు పొందిన అజాతశత్రువు దివంగత ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి సంతాప సభ ఢిల్లీలో జరిగింది. గౌతమ్ రెడ్జి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఏపీ భవన్ అధికారులు.
తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు మంత్రి బొత్స సత్యనారాయణ. గౌతమి రెడ్డి మరణం వార్త అబధ్దం కావాలని కోరుకున్నాను. ఎప్పుడూ నవ్వుతూ ఉండే మనిషి ఇక లేరు. గౌతమ్ రెడ్డి వ్యక్తిత్వాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి, కుటుంబ సభ్యులుకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలి. మా మంత్రివర్గంలో నెంబర్ వన్ వ్యక్తి గౌతమ్ రెడ్డి అన్నారు మంత్రి బొత్స.
Also Read
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
మంత్రితో పాటు నివాళులు అర్పించారు ఎంపీలు సత్యవతి, రెడ్డప్ప, రంగయ్య,మాధవ్, ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్, ఏపీ భవన్ సిబ్బంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మేకపాటి కుటుంబం, గౌతమ్ రెడ్డి చేసిన కృషి అనన్య సామాన్యం అన్నారు ఎంపీ గోరంట్ల మాధవ్. ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ అత్యంత క్రమశిక్షణ , ఎనర్జీ కలిగిన నాయకుడు గౌతమ్ రెడ్డి, పాలిటెక్నిక్, ఐటిఐ లను ఇంటిగ్రేట్ చేయాలన్న ఆలోచన చేశారన్నారు. ఆయనతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు ప్రవీణ్ ప్రకాష్. గౌతమ్ రెడ్డి మృతి అత్యంత దురదృష్టకరం, చిన్న పరిశ్రమల బాగుకోసం పరితపించిన వ్యక్తి అన్నారు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్.
విధిరాతకు ఎవరైనా తలవంచకు తప్పదు. ఇటీవలే 5 వేల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చారు. గొప్ప సమర్ధుడైన నాయకుడు. భగవంతుడు మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నారు ఎంపీ రెడ్డప్ప. గౌతమి రెడ్డి లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నాను. 11 ఏళ్లు గా పరిచయం. నన్ను ఓ తమ్ముడిలా పలు అంశాల్లో మార్గదర్శకం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్జి పట్ల అత్యంత అభిమానాలతో, గొప్ప సహచరుడుగా వ్యవహరించారు. తిరుపతిలో పలు ప్రాజెక్టులు కార్యరూపం దాల్చడంలో గౌతమి రెడ్డి నాకు తోడుగా నిలిచారని ఆవేదనకు లోనయ్యారు డా.ఎంపీ గురుమూర్తి.
ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ ఈ వార్త నిజంకాకుండా ఉంటే బాగుంటుందని భావించాను. నిగర్వి, సౌమ్యుడు, సమర్ధుడు అయున గౌతమి రెడ్డిని కోల్పోవడం చాలా బాధాకరం. కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నా అని నివాళులర్పించారు. ఉజ్వల భవిష్యత్ ఉన్న సోదరుడుని కోల్పోవడం చాలా దురదృష్టకరం. మృధు స్వభావి, సమర్ధులైన గౌతమి రెడ్డి మరణం రాష్ట్రానికి తీరని లోటు. కుటుంబ సభ్యులకు సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నా అన్నారు ఎంపీ సత్యవతి.
తాజావార్తలు
-
Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
-
Vladimir Putin: “మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు”.. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
-
Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
-
Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!