Botsa satyanarayana: అమరావతిలో ఉన్నది రైతులు కాదు.. బ్రోకర్లు, బాబు చుట్టాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa satyanarayana: ఏపీలో మూడు రాజధానుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలు తమను ఆశీర్వదిస్తున్నారని వ్యాఖ్యానించారు. శాసనసభ చట్టాలు చేసేందుకే ఉందని.. శాసనసభ సాక్షిగా సీఎం జగన్ రైతులతో జరిగిన ఒప్పందాలను అంగీకరిస్తున్నట్లు ప్రకటించారని మంత్రి బొత్స తెలిపారు. మరి చంద్రబాబు ఒప్పంద పత్రంలో ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. సీఎం జగన్ యూటర్న్ తీసుకోలేదని.. ఏపీలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆయన ఆరాటపడుతున్నారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో ఈరోజు వచ్చిన ప్రస్తావనలను మొదట్నుంచీ తమ ప్రభుత్వం చెప్తోందన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులపై కామెంట్ చేయడం భావ్యం కాదని మంత్రి బొత్స అన్నారు.
Read Also: Ben Stokes: పాకిస్థాన్కు బెన్ స్టోక్స్ భారీ విరాళం.. ఎంత ఇచ్చాడంటే..?
Also Read
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
ప్రభుత్వం అంటే సెట్టింగ్లా చంద్రబాబు భావించారని.. అందుకే రాజధానిలో రెండు బిల్డింగ్లే కట్టారని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణం కోసం స్క్వేర్ ఫీట్కు రూ.11వేలు ఖర్చు పెట్టారని వివరించారు. అమరావతిలో ఉన్నది రైతులు కాదని.. బ్రోకర్లు అని.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అని.. చంద్రబాబు చుట్టాలు అని ఆరోపించారు. రైతుల పేరుతో ఇతరులు చలామణి అవుతున్నారని.. కోర్టు ఆదేశాలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మూడు రాజధానుల అంశం తమ ప్రభుత్వ విధానం అన్నారు. వికేంద్రీకరణకు తాము కట్టుబడి ఉన్నామని.. చివరకు న్యాయమే గెలుస్తుందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు కూడా ఈ అంశంపై స్పందించారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చూస్తే న్యాయం ఇంకా ఉంది అనిపిస్తుందన్నారు. హై కోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని సీఎం జగన్ కాపాడుతున్నారని తెలిపారు. హైకోర్టు తీర్పు పట్ల సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసిందన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ చేసే అధికారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఎందుకు ఉండదని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో 4,700 ఎకరాలు తన సొంత మనుషులతో చంద్రబాబు కొనిపించారని తేలిందన్నారు. అమరావతి రైతులతో చంద్రబాబు పాదయాత్రలు చేయించారని ఆరోపించారు. సుప్రీం ఇచ్చిన ఉత్తర్వులతో ఇప్పటికైనా ఆయన కళ్లు తెరవాలని.. ప్రభుత్వం చేసే పనులను న్యాయస్థానాలు చేయకూడదని వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
-
Gold and Silver Rates: కమింగ్ డౌన్.. నేడు మళ్లీ పతనమైన గోల్డ్, సిల్వర్ ధరలు..
-
TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
-
Vrushakarma: ‘వృషకర్మ’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
India Unemployment: ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు.. ఏప్రిల్లో 5.2% శాతానికి
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..