Botsa satyanarayana: అమరావతిలో ఉన్నది రైతులు కాదు.. బ్రోకర్లు, బాబు చుట్టాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa satyanarayana: ఏపీలో మూడు రాజధానుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలు తమను ఆశీర్వదిస్తున్నారని వ్యాఖ్యానించారు. శాసనసభ చట్టాలు చేసేందుకే ఉందని.. శాసనసభ సాక్షిగా సీఎం జగన్ రైతులతో జరిగిన ఒప్పందాలను అంగీకరిస్తున్నట్లు ప్రకటించారని మంత్రి బొత్స తెలిపారు. మరి చంద్రబాబు ఒప్పంద పత్రంలో ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. సీఎం జగన్ యూటర్న్ తీసుకోలేదని.. ఏపీలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆయన ఆరాటపడుతున్నారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో ఈరోజు వచ్చిన ప్రస్తావనలను మొదట్నుంచీ తమ ప్రభుత్వం చెప్తోందన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులపై కామెంట్ చేయడం భావ్యం కాదని మంత్రి బొత్స అన్నారు.
Read Also: Ben Stokes: పాకిస్థాన్కు బెన్ స్టోక్స్ భారీ విరాళం.. ఎంత ఇచ్చాడంటే..?
Also Read
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
ప్రభుత్వం అంటే సెట్టింగ్లా చంద్రబాబు భావించారని.. అందుకే రాజధానిలో రెండు బిల్డింగ్లే కట్టారని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణం కోసం స్క్వేర్ ఫీట్కు రూ.11వేలు ఖర్చు పెట్టారని వివరించారు. అమరావతిలో ఉన్నది రైతులు కాదని.. బ్రోకర్లు అని.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అని.. చంద్రబాబు చుట్టాలు అని ఆరోపించారు. రైతుల పేరుతో ఇతరులు చలామణి అవుతున్నారని.. కోర్టు ఆదేశాలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మూడు రాజధానుల అంశం తమ ప్రభుత్వ విధానం అన్నారు. వికేంద్రీకరణకు తాము కట్టుబడి ఉన్నామని.. చివరకు న్యాయమే గెలుస్తుందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు కూడా ఈ అంశంపై స్పందించారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చూస్తే న్యాయం ఇంకా ఉంది అనిపిస్తుందన్నారు. హై కోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని సీఎం జగన్ కాపాడుతున్నారని తెలిపారు. హైకోర్టు తీర్పు పట్ల సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసిందన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ చేసే అధికారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఎందుకు ఉండదని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో 4,700 ఎకరాలు తన సొంత మనుషులతో చంద్రబాబు కొనిపించారని తేలిందన్నారు. అమరావతి రైతులతో చంద్రబాబు పాదయాత్రలు చేయించారని ఆరోపించారు. సుప్రీం ఇచ్చిన ఉత్తర్వులతో ఇప్పటికైనా ఆయన కళ్లు తెరవాలని.. ప్రభుత్వం చేసే పనులను న్యాయస్థానాలు చేయకూడదని వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
-
Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
-
NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
-
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్గా ఇలా చేసేయండి!
-
Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!