Site icon NTV Telugu

ఖచ్చితంగా విశాఖే ఎగ్జిక్యూటివ్ రాజధాని.. మంత్రి అవంతి

ఏపీలో మళ్ళీ మూడురాజధానుల అంశం తెరమీదకు వచ్చింది. తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎన్నికల హామీకి అనుగుణంగా రాష్ట్రంలో 26జిల్లాలు ఏవిధంగా వచ్చాయో….మూడు రాజధానులు అదే విధంగా వస్తాయన్నారు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అవ్వడం ఖాయం అని ధీమాగా చెప్పారు.

చంద్రబాబు ఎప్పుడు ఊహలు, అయోమయంలో ఉంటారని ఎద్దేవా చేశారు. కొత్త జిల్లాలకు టీడీపీ అనుకులమో…!? వ్యతిరేకమో చెప్పాలన్నారు. చారిత్రాత్మక నిర్ణయానికి తగ్గట్టుగానే నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తాం. సీఎంకు గిరిజనులపై అభిమానం ఎక్కువ. అందుకే రెండు జిల్లాలు ఇచ్చారన్నారు మంత్రి అవంతి.

https://ntvtelugu.com/rgv-heroine-inaya-sulthana-pub-video-viral/

కొత్త జిల్లాల వల్ల అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది.రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి అన్ని వర్గాలు స్వాగతించాలి. కొత్త జిల్లాల నిర్ణయంలో ఎటువంటి రాజకీయాలకు ఆస్కారం లేదు. మూడు రాజధానులకు, కొత్త జిల్లాలకు లింక్ పెట్టి మాట్లాడటం సరైన విధానం కాదు. పునర్వ్యవస్థీకరణ వల్ల రాష్ట్రంకు లాభమా…?. నష్టమా…?.అనేది చంద్రబాబు ఆలోచించాలి. పరిపాలన వికేంద్రీకరణ వల్ల ఆశించిన స్థాయిలో అభివృద్జి జరుగుతుంది.

చంద్రబాబు మంచిని స్వాగతించలేరు. ఓవర్ నైట్ జిల్లాలు ప్రకటించారనేది అసంబద్ధమైన మాట అన్నారు. ఎన్నికల ముందే సీఎం ప్రకటించారు. వంగవీటి రంగా పేరును జిల్లాకు పెట్టమని అక్కడి ప్రజలు కోరుకుంటే కమిటీ పరిశీలిస్తుంది. ఉద్యోగుల సమస్య తాత్కాలికమైనది… చర్చల ద్వారా పరిష్కరిస్తాం…పీఆర్సీకి జిల్లాలకు లింక్ పెట్టడం సరైంది కాదన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్.

Exit mobile version