Meeseva Charges: ఏపీలో మరో బాదుడు.. మీసేవ ఛార్జీల పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో అన్ని ఛార్జీలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్, కరెంట్ ఛార్జీలతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ బాదుడులో మరో బాదుడు వచ్చి చేరింది. మీ సేవ కేంద్రాల ద్వారా అందించే సేవలకు వసూలు చేసే సర్వీసు ఛార్జీలను సైతం ప్రభుత్వం పెంచింది. ఇప్పటికే ఇంటి పన్ను, విద్యుత్ ఛార్జీల పెంపుతో అల్లాడుతున్న ప్రజలపై సర్కార్ అదనుపు బాదుడు మోపుతుంది. పెంచిన మీ సేవ సర్వీసు ఛార్జీలు అమలులోకి వచ్చాయి.
మీ సేవ కేంద్రాల ద్వారా అందించే సేవలకు వసూలు చేసే సర్వీసు ఛార్జీలను ప్రభుత్వం తాజాగా పెంచింది. కేటగిరి – ఎ, కేటగిరి – బి కింద అందించే సేవలకు వసూలు చేసే ఛార్జీలను 5 రూపాయల మేర పెంచింది. దీని ద్వారా ఏడాదికి సుమారు 60 కోట్ల భారం సామాన్య ప్రజలపై పడనుంది. ఇప్పటికే వివిధ ఛార్జీలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ పెంపుతో వారిపై సర్కార్ అదనపు బాదుడుపై జనం మండిపడుతున్నారు. మీ సేవ ద్వారా వివిధ విభాగాలకు చెందిన సుమారు 512 రకాల సేవలు అందుతాయి. దీనికి సర్వీసు ఛార్జీ కింద ఎ కేటగిరి కింద 35, బి కేటగిరి కింద 45 రూపాయల వంతున ప్రభుత్వం వసూలు చేస్తోంది. ఇందులో నిర్వాహకులకు చెల్లించే మొత్తం పోనూ… మిగిలిన మొత్తం ప్రభుత్వం ఖాతాలో జమ అవుతుంది. నిన్నటి నుంచి సర్వీసు ఛార్జీలను మార్పు చేస్తున్నట్లు నిర్వాహకులకు సంబంధిత శాఖ సమాచారం పంపింది.
Also Read
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
- AP Government Jobs: గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
ఇప్పటికే ధరల భారం భరించలేని సామాన్యులు రకరకాలుగా తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మీ సేవ ఛార్జీలు సైతం పెంచడం అంటే ఎక్కడ మరో శ్రీలంక అవుతుందా అన్నట్లుంది ఏపీ పరిస్థితి.పోను పోను ఉన్న జీతాలకు అయ్యే ఖర్చుకు సంబంధం లేకుండా పోయేలా ఉంది. నిత్యావసరాలు సైతం సామాన్యులు కొనలేని విధంగా మారాయి. ధరలను నియంత్రించాల్సిన ప్రభుత్వాలే ఇలా ప్రజలపై అదనపు భారం మోపుతుంటే ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం ఇప్పటికైనా పెంచే దిశగా కాకుండా ధరలు తగ్గించే దిశగా అడుగులు వేయాలని కోరుతున్నారు.
https://ntvtelugu.com/leaders-fight-in-dwarakatirumala-ysrcp/
తాజావార్తలు
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!