May Day: వాడవాడలా మే డే వేడుకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్మిక దినోత్సవం మే డే వేడుకలు ఏపీలో ఘనంగా నిర్వహిస్తున్నారు, వామపక్షాల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో మేడే వేడుకల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాక కార్మికుల హక్కులను కాలరాస్తుంది. పోరాడి సాధించుకున్న 44 చట్టాలను ఒక్క కలం పోటుతో కేంద్రం రద్దు చేసింది.
హక్కుల కోసం ఉద్యమిస్తే, పోరాడితే, ప్రశ్నిస్తే, అక్రమంగా కేసులు పెడుతున్నారు. కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా నిబంధనలన్నీ వారి గుప్పెట్లో పెట్టారు. ప్రభుత్వ సంపదలను అంబానీ, అదానీలకు దోచి పెడుతున్నారు. మోడీ చెప్పినట్లుగా జగన్ పాలన సాగిస్తూ.. కార్పోరేట్ సంస్థలకు కారు చౌకగా కట్టు బెడుతున్నారు. కార్మికుల హక్కులను సాధించుకునేందుకు మరోసారి కార్మికులంతా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
సీపీఎం సీనియర్ నాయకుడు మధు మాట్లాడుతూ.. సీపీయస్ రద్దు కోసం ప్రభుత్వం ఉద్యోగులతో సంప్రదింపులు జరపాలి. జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పోలీసులను అడ్డం పెట్టుకుని నిర్భంధించడం సబబు కాదు. ఏలూరులో వైసీపీలో వచ్చిన వర్గ పోరుతోనే హత్యలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే పైనే దాడి చేసే స్థాయికి ప్రజలు వచ్చారంటే.. అది ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహమే కారణం అన్నారు. రైతాంగానికి ధరలు లేవు, కౌలు రైతులకు రక్షణ లేదు. పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగిపోతుంటే.. వాటిపై మరిన్ని పన్నులు పెంచుతున్నారు. రాష్ట్రంలో దళితులు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారంపై చర్చించాలన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మేడే వేడుకల్లో పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా కార్మికులు మేడే జరుపుకుంటున్నారు. కేంద్రం కార్పొరేటుకు ఊడిగం చేస్తోందని విమర్శించారు. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున పోరాడాలి. సీపీఎస్ రద్దు అంటే జీపీఎస్ అంటూ మాట తప్పాడు, మడమ తిప్పాడు. ఈ రాష్ట్రంలో పోలీసులు ఉన్నారా.. వారానికి రెండు రేప్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా ఉన్నారు. హోంమంత్రి నామ మాత్రమే. పోలీసు వ్యవస్ధను సీఎం జగన్, సజ్జల నడుపుతున్నారు. ప్రతిపక్షాలను అణచడానికే పోలీసులను వాడుతున్నారని విమర్శించారు.
రాజమండ్రి సి.పి.ఐ జాతీయ కార్యదర్శి నారాయణ మేడే విప్లవ అభినందనలు తెలిపారు. నిన్న ఢిల్లీలో ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ విలువైన సూచనలు చేశారన్నారు. న్యాయవ్యవస్థలో ముందుగా దేశ ద్రోహం చట్టం రద్దు చెయ్యాలి. బ్రిటీష్ కాలం నాటి దేశద్రోహం చట్టం ఇప్పుడెందుకు. కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్న కేసులు ప్రభుత్వం నుంచే ఎక్కువగా ఉన్నాయి. కోర్టు ధిక్కరణ చేస్తున్న ముఖ్యమంత్రుల్లో జగన్ నెంబర్ వన్. తెలంగాణ నుంచి ఛీప్ సెక్రటరీ కోర్టు ధిక్కరణాల్లో నెంబర్ వన్. మే డే సందర్బంగా రాజమండ్రి సీపీఐ కార్యాలయం వద్ద పార్టీ జెండా ఆవిష్కరించారు జాతీయ కార్యదర్శి నారాయణ. సీపీఐ కార్మికసంఘం ఆధ్వర్యంలో మేడే ర్యాలీలో పాల్గొన్నారు నారాయణ.
తాజావార్తలు
-
Karuppu : కరుప్పు రిలీజ్ కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్
-
Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
-
Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
-
Spirit : స్పిరిట్.. ఇది కదా కావాల్సింది!
-
Virat Kohli Chase Master: విరాట్ కోహ్లీ కొడితే అర్సిబీ గెలవాల్సిందే.. షాకింగ్ గణాంకాలు ఇవే!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!