Love Tragedy: చిత్తూరులో షాకింగ్ ఘటన.. వరుసకు కూతురయ్యే మైనర్ బాలికతో ఎఫైర్.. ఆ తర్వాత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man And Minor Girl Commits Suicide After Their Extramarital Affair Exposed: చిత్తూరు జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. వరుసకు కూతురు అయ్యే మైనర్ బాలికతో ఓ వ్యక్తి వివాహేతర సంబంధం నడిపించాడు. వావివరసలు మరిచి, ఆ వ్యక్తి మైనర్ బాలికని తన మాయమాటలతో బుట్టలతో పడేసి, ఎఫైర్ నడిపాడు. చివరికి తమ విషయంలో ఇంట్లో తెలియడంతో, ఇద్దరు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. షాక్కి గురిచేసే ఈ ఘటన పుంగనూరులో వెలుగుచూసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. పుంగనూరులో నివాసముంటున్న గంగులయ్యకు పెళ్లి అయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మరోవైపు.. నక్షత్ర అనే మైనర్ బాలిక పుంగనూరు బసవరాజా బాలికల కళాశాలలో 10వ తరగతి చదువుతోంది. గంగులయ్యకు నక్షత్ర వరుసకు కూతురు అవుతుంది.
Also Read
- AP Doctors: విధులకు గైర్హాజరైన 43 మoది డాక్టర్ల డిస్మిస్.. మరో 34 మంది రాజీనామా..
- Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
- Beach Shacks in AP: గోవా తరహాలో ఏపీ బీచ్లలో బార్లు.. మార్గదర్శకాలు జారీ
- Shyamala: శాంతిభద్రతలపై మౌనం.. మేకప్పై స్పందన.. హోంమంత్రి వ్యాఖ్యలకు ఆరే శ్యామల కౌంటర్..
అయితే.. గంగులయ్య వావివరసలు మరిచి, నక్షత్రను మాయమాటలతో తన బుట్టలో పడేసి, ఆ బాలికతో ప్రేమాయణం మొదలుపెట్టాడు. కొంతకాలం నుంచి వీళ్లిద్దరు ఎవ్వరికీ తెలియకుండా, గుట్టుగా తమ ఎఫైర్ నడుపుతున్నారు. అయితే.. వీరి ఎఫైర్ ఎంతోకాలం దాగి ఉండలేదు. వీరిద్దరు తరచుగా కలుస్తుండటం, ప్రవర్తనలోనూ మార్పు రావడాన్ని కుటుంబసభ్యులు గమనించారు. చివరికి.. వీళ్లిద్దరు అడ్డంగా దొరికిపోయారు. కుటుంబసభ్యులందరూ నిలదీయడంతో, వీళ్లిద్దరు మనస్తాపానికి గురయ్యారు. ముఖ్యంగా.. గుంగలయ్యను అందరూ నిలదీశారు. కూతురు వరుసయ్యే బాలికతో ఎలా ఎఫైర్ నడుపుతావంటూ మందలించారు. దీన్ని గంగులయ్య అవమానంగా భావించాడు. అటు, ఆ బాలిక కూడా తీవ్ర మనోవేదనకు గురైంది. వీరి వ్యవహారం పోలీస్ స్టేషన్దాకా కూడా వెళ్లింది.
Morphing Photos: నిశ్చితార్థం చెడగొట్టేందుకు కాబోయే భర్తకు మార్ఫింగ్ ఫోటోలు పంపిన మహిళ
అప్పటి నుంచి గుంగలయ్య, నక్షత దూరంగా ఉంటున్నా.. తమకు జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేకపోయారు. అలాగే, ఒకరిని వదిలి మరొకరు ఉండలేకపోయారు. దీంతో.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో తెలియకుండా చింపారపల్లి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఓ చెట్టుకు ఉరివేసుకొని, ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్లు కనిపించకపోవడంతో ఇంటి పెద్దలు గాలించగా.. వీళ్లు ఉరివేసుకొని కనిపించారు. వీరి మరణంతో ఇరుకుటుంబాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. వీళ్లు నిజంగానే ఆత్మహత్య చేసుకున్నారా? లేకపోతే వీరిని చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారా? అనే కోణాల్లో విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
India Women History: టీ20 ప్రపంచకప్లో భారత్ చరిత్రాత్మక ఘనత.. రికార్డు పుస్తకాల్లో హర్మన్ సేన!
-
ASUS Dawn 7S Ryzen Edition: 16GB RAM, Ryzen AI చిప్తో.. Asus Dawn 7S Ryzen Edition ల్యాప్టాప్ విడుదల.. ధర ఎంతంటే?
-
Kakatia Hills Land Case: మాదాపూర్ కాకతీయ హిల్స్ భూ వివాదం.. అయ్యన్న ఇన్ఫ్రా ఎండీ శ్రీధర్ అరెస్ట్!
-
Ragi Ganji: శరీరానికి చల్లదనం, ఎముకలకు బలం.. సాంప్రదాయ ‘రాగి గంజి’ తయారీ చేసుకోండి ఇలా.!
-
Vaibhav Sooryavanshi: సీనియర్ జట్టులో వైభవ్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు? స్పోర్ట్స్ సైకాలజిస్ట్ క్లారిటీ..
ట్రెండింగ్
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!