Nuzividu IIIT Protest:నూజివీడు ట్రిపుల్ ఐటీలో అధ్యాపకుల నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉన్నత విద్యాసంస్థలు బాలారిష్టాలను దాటడం లేదు. బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్ధులు వసతులు, సౌకర్యాల కోసం భారీ ఎత్తున ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అధ్యాపకులు ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో రెండవ రోజు కూడా ఉద్యోగులు నిరసనలు కొనసాగించారు. ఏపీలోని నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లలో యుజిసి కొత్త పే స్కేల్స్ ప్రకారం వేతనాలు సవరించమని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ అధ్యాపకులు శాంతి యుతంగా చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని రెండవ రోజు కూడా కొనసాగించారు.
తమకు తక్షణమే న్యాయం చేయమని కోరుతూ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాకు నుండి మెయిన్ గేట్ వద్ద వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ర్యాలీ చేశారు. తమ బాధను వ్యక్త పరుస్తూ గత ఆరు నెలలుగా లెక్కకు మించిన వినతి పత్రాలు అందచేసినప్పటికి యూనివర్సిటీ యాజమాన్యం కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందే తప్ప , పరిష్కారం చూపడం లో విఫలం అవుతుంది అని తెలిపారు. కేసి రెడ్డి మొదట్లో ఛాన్సలర్ గా బాధ్యతలు స్వీకరించగానే రెండు నెలల్లో అందరి సమస్యలు తీరుస్తా అని హామీ ఇచ్చారు. దురదృష్టవశాత్తూ యేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సమస్యలను పరిష్కరించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు అని కాంట్రాక్టు అధ్యాపకులు తెలిపారు.
Also Read
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- Nellore Politics: గ్రౌండ్ వర్క్ స్టార్ట్.. రాజకీయాల్లోకి ప్రముఖ నాయకుల కూతుళ్లు, కోడళ్లు!
- Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
- Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
Read Also: India Economy: 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.
RGUKT అనేది దేశంలోనే ప్రత్యేక యూనివర్సిటీ అని , కానీ జీవో నెం 110 ద్వారా యూనివర్సిటీని నీరు గార్చే ప్రమాదం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్ళి ఉద్యోగులకి భరోసా కల్పించాల్సిన వ్యక్తే ఇలా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు అధ్యాపకులు. వైఎస్ ఛాన్సలర్ పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచారు. ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమం కోసం ఆలోచిస్తున్నపటికి , అధికారులు ఈ రకంగా జాప్యం చేయడం చాలా బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని అధ్యాపకులు ఆందోళన చేశారు.
తాజావార్తలు
-
Layoffs: జాబ్స్కు రెడ్ అలెర్ట్.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఎందుకు ఊడుతున్నాయ్..? కాగ్నిజెంట్ నివేదికలో ఏముంది?
-
Pawan Kalyan: “రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా”.. తెలంగాణపై మరోసారి స్పందన.!
-
KTR: “తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా”.. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
-
IRUMUDI Glimpse : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్.. రవితేజకు హిట్ గ్యారంటీ
-
Power Saving Tips: ఏసీ కాదు..కూలర్ కాదు.. మీ సీలింగ్ ఫ్యాన్తోనే కరెంట్ బిల్లు వాచిపోద్ది..ఎలాగంటే?
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!