Nuzividu IIIT Protest:నూజివీడు ట్రిపుల్ ఐటీలో అధ్యాపకుల నిరసన
ఉన్నత విద్యాసంస్థలు బాలారిష్టాలను దాటడం లేదు. బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్ధులు వసతులు, సౌకర్యాల కోసం భారీ ఎత్తున ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అధ్యాపకులు ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో రెండవ రోజు కూడా ఉద్యోగులు నిరసనలు కొనసాగించారు. ఏపీలోని నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లలో యుజిసి కొత్త పే స్కేల్స్ ప్రకారం వేతనాలు సవరించమని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ అధ్యాపకులు శాంతి యుతంగా చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని రెండవ రోజు కూడా కొనసాగించారు.
తమకు తక్షణమే న్యాయం చేయమని కోరుతూ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాకు నుండి మెయిన్ గేట్ వద్ద వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ర్యాలీ చేశారు. తమ బాధను వ్యక్త పరుస్తూ గత ఆరు నెలలుగా లెక్కకు మించిన వినతి పత్రాలు అందచేసినప్పటికి యూనివర్సిటీ యాజమాన్యం కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందే తప్ప , పరిష్కారం చూపడం లో విఫలం అవుతుంది అని తెలిపారు. కేసి రెడ్డి మొదట్లో ఛాన్సలర్ గా బాధ్యతలు స్వీకరించగానే రెండు నెలల్లో అందరి సమస్యలు తీరుస్తా అని హామీ ఇచ్చారు. దురదృష్టవశాత్తూ యేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సమస్యలను పరిష్కరించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు అని కాంట్రాక్టు అధ్యాపకులు తెలిపారు.
Also Read
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
Read Also: India Economy: 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.
RGUKT అనేది దేశంలోనే ప్రత్యేక యూనివర్సిటీ అని , కానీ జీవో నెం 110 ద్వారా యూనివర్సిటీని నీరు గార్చే ప్రమాదం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్ళి ఉద్యోగులకి భరోసా కల్పించాల్సిన వ్యక్తే ఇలా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు అధ్యాపకులు. వైఎస్ ఛాన్సలర్ పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచారు. ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమం కోసం ఆలోచిస్తున్నపటికి , అధికారులు ఈ రకంగా జాప్యం చేయడం చాలా బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని అధ్యాపకులు ఆందోళన చేశారు.
తాజావార్తలు
-
Kavitha New Party Launch: కవిత కొత్త పార్టీ పేరు ప్రకటన.. బీఆర్ఎస్కు బిగ్ షాక్..
-
Nithiin : నితిన్ సరసన ‘మిరాయ్’ బ్యూటీ..
-
Anant Ambani: ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అనంత్ అంబానీ వాచ్.. రూ.12 కోట్ల ఆ వాచ్ ప్రత్యేకతలు ఇవే!
-
IPL 2026: ఐపీఎల్లో ఈ కెప్టెన్ల విఫలం.. నిర్ణయాలలో తడబాటు.. కుంగిపోతున్న ట్లు..!
-
Hyderabad: ఏటీఎంలో ఊపిరాడక మృతి.. ఉదయం 5:30కు లోపలికి.. గంట తర్వాత విగతజీవిగా!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!