BC Leaders Demand: బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని బరిలోకి దించాలని గోనెగండ్ల మాజీ సర్పంచ్ రంగముని పోతలపాటి అభ్యర్థించారు. ఆయనతో పాటు నాయకులు బాబు నాయుడు, లక్ష్మీనారాయణ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గం వారికి కేటాయిస్తే.. తాము గెలిపించుకోవడానికి తమ శాయ శక్తుల కృషి చేస్తామని పేర్కొన్నారు. అంతకుముందు.. గోనెగండ్ల మండలంలోని కాశీ నీలకంఠేశ్వర దేవాలయం, చింతలముని నల్లారెడ్డి ఆశ్రమంలో పూజలు చేసి మండలంలో విస్తృత ప్రచారం చేశారు. పెద్దమర్రి వీడు, చిన్నమర్రి వీడు, కులుమాల గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు.
Nampally Numaish: నేటితో ముగియనున్న నుమాయిష్
Also Read
- Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
- CM Chandrababu Warning: పవన్ కల్యాణ్పై నోరు పారేసుకుంటే ఖబర్దార్.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- CM Chandrababu: జొన్నగిరి ఇక ‘స్వర్ణగిరి’.. స్వర్ణాంధ్రకు నాంది పలికిన గోల్డ్ ప్రాజెక్ట్
- US Plane Crash: అమెరికా విమాన ప్రమాదం.. తెలుగు యువకుడు మృతి
ప్రతి గ్రామంలో పర్యటిస్తున్న గోనెగండ్ల మాజీ సర్పంచ్ రంగముని పోతలపాటి బీసీ నాయకులతో మాట్లాడుతున్న సందర్భంలో టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు స్కాలర్షిప్స్, బీసీ కార్పొరేషన్ వంటి వాటిని బీసీ సామాజికవర్గానికి కేటాయించారు. కానీ నేటి ప్రభుత్వంలో బీసీలకు ఎటువంటి ప్రాధాన్యం లేకపోగా, ఉన్న వాటిని కూడా తొలగించారు అని అక్కడి గ్రామస్థులు విన్నవించారు. అనంతరం ఇంటింటికీ తిరిగి మహిళల సమస్యలు తెలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే తల్లికి వందనం పేరుతో ప్రతి ఇంట్లో చదువుకొనే పిల్లలు ఉంటే వారందరికీ సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇస్తారని చెప్పారు. ఇంకా దీపం పేరుతో ప్రతి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని తెలిపారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వీటితో పాటు ఆరు పథకాలు గురించి రంగముని పోతలపాటి విస్తృత ప్రచారం చేస్తున్నారు. అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకొని టీడీపీ ప్రభుత్వం రాగానే ఈ సమస్యలన్నిటిని పరిష్కరిస్తాను అని వారికి హామీ ఇచ్చారు.
Bees attack: పెళ్లికి పిలువని ఆహ్వానితులు.. బంధువులు పరుగో పరుగు.. వీడియో వైరల్..
ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కృష్ణారెడ్డి, మాజీ సింగల్ విండో ప్రెసిడెంట్ పరమేశ్వరరెడ్డి, మాజీ ఎంపీటీసీ రహమతుల్లా, అగ్రహారం పార్వతమ్మ, టి.ప్రభాకర్ నాయుడు, పూతలపాటి రంగముని, చానాల రాయుడు, ఎస్ బి. యూనిస్, చిట్యాల మునియప్ప, కాలపర్రి రంగముని, బేకల్ లక్ష్మీనారాయణ, రంగారెడ్డి, లక్ష్మన్న, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!