BC Leaders Demand: బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని బరిలోకి దించాలని గోనెగండ్ల మాజీ సర్పంచ్ రంగముని పోతలపాటి అభ్యర్థించారు. ఆయనతో పాటు నాయకులు బాబు నాయుడు, లక్ష్మీనారాయణ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గం వారికి కేటాయిస్తే.. తాము గెలిపించుకోవడానికి తమ శాయ శక్తుల కృషి చేస్తామని పేర్కొన్నారు. అంతకుముందు.. గోనెగండ్ల మండలంలోని కాశీ నీలకంఠేశ్వర దేవాలయం, చింతలముని నల్లారెడ్డి ఆశ్రమంలో పూజలు చేసి మండలంలో విస్తృత ప్రచారం చేశారు. పెద్దమర్రి వీడు, చిన్నమర్రి వీడు, కులుమాల గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు.
Nampally Numaish: నేటితో ముగియనున్న నుమాయిష్
Also Read
- CM Chandrababu Warning: పవన్ కల్యాణ్పై నోరు పారేసుకుంటే ఖబర్దార్.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- CM Chandrababu: జొన్నగిరి ఇక ‘స్వర్ణగిరి’.. స్వర్ణాంధ్రకు నాంది పలికిన గోల్డ్ ప్రాజెక్ట్
- US Plane Crash: అమెరికా విమాన ప్రమాదం.. తెలుగు యువకుడు మృతి
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
ప్రతి గ్రామంలో పర్యటిస్తున్న గోనెగండ్ల మాజీ సర్పంచ్ రంగముని పోతలపాటి బీసీ నాయకులతో మాట్లాడుతున్న సందర్భంలో టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు స్కాలర్షిప్స్, బీసీ కార్పొరేషన్ వంటి వాటిని బీసీ సామాజికవర్గానికి కేటాయించారు. కానీ నేటి ప్రభుత్వంలో బీసీలకు ఎటువంటి ప్రాధాన్యం లేకపోగా, ఉన్న వాటిని కూడా తొలగించారు అని అక్కడి గ్రామస్థులు విన్నవించారు. అనంతరం ఇంటింటికీ తిరిగి మహిళల సమస్యలు తెలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే తల్లికి వందనం పేరుతో ప్రతి ఇంట్లో చదువుకొనే పిల్లలు ఉంటే వారందరికీ సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇస్తారని చెప్పారు. ఇంకా దీపం పేరుతో ప్రతి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని తెలిపారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వీటితో పాటు ఆరు పథకాలు గురించి రంగముని పోతలపాటి విస్తృత ప్రచారం చేస్తున్నారు. అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకొని టీడీపీ ప్రభుత్వం రాగానే ఈ సమస్యలన్నిటిని పరిష్కరిస్తాను అని వారికి హామీ ఇచ్చారు.
Bees attack: పెళ్లికి పిలువని ఆహ్వానితులు.. బంధువులు పరుగో పరుగు.. వీడియో వైరల్..
ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కృష్ణారెడ్డి, మాజీ సింగల్ విండో ప్రెసిడెంట్ పరమేశ్వరరెడ్డి, మాజీ ఎంపీటీసీ రహమతుల్లా, అగ్రహారం పార్వతమ్మ, టి.ప్రభాకర్ నాయుడు, పూతలపాటి రంగముని, చానాల రాయుడు, ఎస్ బి. యూనిస్, చిట్యాల మునియప్ప, కాలపర్రి రంగముని, బేకల్ లక్ష్మీనారాయణ, రంగారెడ్డి, లక్ష్మన్న, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!