NTV Telugu Site icon

తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల కేటాయింపు.. ఎవరికి ఎంత?

తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల కేటాయింపును కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఖరారు చేసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద ఈనెల 15 వరకు 112.5 టీఎంసీల నీటి వినియోగానికి బోర్డు ఆమోదం తెలిపింది. జూన్ 1 నుంచి నవంబర్ 30 వరకు రెండు ప్రాజెక్టుల కింద ఏపీ, తెలంగాణ కలిపి 294.33 టీఎంసీల నీటిని వాడుకున్నాయి. బోర్డు తాజా నిర్ణయంతో తెలుగు రాష్ట్రాలు సంయుక్తంగా మరో 407 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం దక్కించుకున్నాయి.

Read Also: పీఆర్సీపై సీఎస్ స‌మీర్ శ‌ర్మ కీల‌క ప్ర‌క‌ట‌న

ఈ ఏడాది జూన్ 1 నుంచి నవంబర్ 30 వరకు 207 టీఎంసీల నీటి వినియోగానికి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు ఇవ్వగా… 212.43 టీఎంసీలు వాడుకుంది. 169 టీఎంసీల నీటి వినియోగానికి తెలంగాణ సర్కారు ప్రతిపాదనలు ఇవ్వగా కేవలం 81.85 టీఎంసీలు మాత్రమే వాడుకుంది. రెండు రాష్ట్రాలు వాడుకున్న నీటికి ఆమోదం తెలిపిన బోర్డు… ఈనెల 15 వరకు ఏపీ 23.68 టీఎంసీలు, తెలంగాణ 88.82 టీఎంసీలు వాడుకునేందుకు ఆమోదం తెలిపింది. డిసెంబర్ 15 తర్వాత రెండు రిజర్వాయర్లలోని కనీస నీటిమట్టాలపై 145 టీఎంసీలు అందుబాటులో ఉంటాయి.