Bengaluru Rains: బెంగళూర్లో వర్షాలకు కృష్ణా జిల్లా యువతి మృతి.. పరిహారం ప్రకటించిన సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Rains: బెంగళూర్ నగరం భారీ వర్షానికి అతలాకుతలం అయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరాయి. అండర్ పాస్ లు అన్ని నీట మునిగాయి. పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులకు రోడ్లపై చెట్లు నేలకొరిగాయి. ఇదిలా ఉంటే బెంగళూర్ వర్షానికి ఆంధ్రప్రదేశ్ కృష్టా జిల్లాకు చెందిన భానురేఖ(22) అనే యువతి మరణించింది. కృష్ణా జిల్లా నుంచి బెంగళూరుకు వచ్చిన కుటుంబం కారులో వెళ్తుండగా K.R. సర్కిల్ సమీపంలోని అండర్ పాస్ వద్ద కారులో నీళ్లు చేరి మునిగిపోయింది. నీరు కారులోకి వెళ్తున్న విషయాన్ని గమనించి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అధికారులు నీటిలో చిక్కుకున్న ఆరుగురిలో ఐదుగురిని సురక్షితంగా రక్షించారు. అయితే నీటిని మింగిన భానురేఖ తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
సమాచారం తెలుసుకున్న సీఎం సిద్ధరామయ్య బాధితురాలి బంధువులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తుకు సిద్ధరామయ్య ఆదేశించారు. మృతురాలు భానురేఖ కృష్ణా జిల్లా తేలుప్రోలుకు చెందినవారు. ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.
Also Read
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
Read Also: Microsoft: జీతం పెరగకున్నా.. మీ ఆదాయాన్ని ఇలా పెంచుకోవచ్చు.. మైక్రోసాఫ్ట్ సీఎంఓ సూచన
బెంగళూర్ నగరంలో మధ్యాహ్నం 3 గంటలకు ఆకాశాన్ని దట్టమైన మేఘాలు కమ్మేశాయి. ఒక్కసారిగి ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన ప్రారంభమైంది. గంటన్నర పాటు కుండపోతగా వర్షం కురిసింది. గాలుల ధాటికి చెట్లు నేలకొరిగాయి. అండర్ పాస్ ల వద్ద నీరు నిలిచిపోవడంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. వర్షం కారణంగా విదానసౌద, మెజెస్టిక్, రేస్ కోర్స్, కేఆర్ సర్కిల్, టౌన్ హాల్, కార్పొరేషన్, మైసూర్ బ్యాంక్ సర్కిల్, జయనగర్, మల్లీశ్వర్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రేస్ కోర్స్ రోడ్డులో ఓ భారీ వృక్షం కారుపై పడింది. కారులో ప్రయాణిస్తున్నవారికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. వర్షం బీభత్స సమాచారం అందుకున్న సీఎం సిద్దరామయ్య వివిధ ప్రాంతాల్లో పర్యటించారు.
తాజావార్తలు
-
Health Tips: టూత్ బ్రష్ ను బాత్రూమ్ లోనే పెడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది
-
Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
-
Ramayana : లాస్ ఏంజెల్స్లో ‘రామాయణ’ ట్రైలర్ లాంచ్
-
Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
-
OnePlus N6: వన్ ప్లస్ N6 భారత్ లో లాంచ్.. 8,000mAh బ్యాటరీతో బడ్జెట్ బీస్ట్!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!