ESI స్కాంలో ఏసీబీ విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఫార్మా అమ్మకాల పేరుతో కంచర్ల శ్రీహరి.. షెల్ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. 4 సంస్థలను ఒకే అడ్రస్తో వేర్వేరు కంపెనీల్లా నడిపినట్లు అధికారులు నిర్ధారించారు. కూకట్పల్లికి చెందిన లెజెండ్ ఎంటర్ ప్రైజస్, మెడి ఓమ్ని ఎంటర్ ప్రైజస్, ఓమ్ని హెల్త్ కేర్ సహా అన్నింటినీ ఒకే అడ్రస్పై … శ్రీహరి నడుపుతున్నట్లు తేల్చారు. ఈస్కాంకు సంబంధించి నలుగురును…. ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. బెజవాడ ఈఎస్ఐ ఆసుపత్రి సూపరెండెంట్ రవికుమార్ ను A-18గా, హైదరాబాద్ లో ఓమ్నీ మెడి ఎంటర్ ప్రైజెస్ నడుపుతున్న కంచర్ల శ్రీహరి….A-19, హైదరాబాద్కు చెందిన ఓమ్ని హెల్త్ కేర్ అధినేత కంచర్ల సుజాత .. A-20గా, ఓమ్ని హెల్త్ కేర్ మేనేజర్ బండి వెంకటేశ్వర్లు..A-21గా నమోదు చేశారు.