ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు నుంచి క్లీన్ షీట్ లభించిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సోదరుడు కేటీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు తనకు శుభాకాంక్షలు చెబుతూనే, మరోవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడానికి ఈ కేసే కారణమని కేటీఆర్ ట్వీట్ చేయడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీ ఓటమిని తన మెడకు చుట్టాలని చూడటం సరికాదని హితవు పలికిన కవిత, అసలు తనపై ఈ కేసు పెట్టింది పార్టీ కోసం కాదా అని నిలదీశారు. నాటి క్లిష్ట పరిస్థితుల్లో తాను ఒంటరిగా పోరాటం చేస్తున్నప్పుడు పార్టీ సోషల్ మీడియా గానీ, కేటీఆర్ లేదా కేసీఆర్ గానీ కనీసం ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టి తనకు మద్దతుగా ఎందుకు మాట్లాడలేదని ఆమె సూటిగా ప్రశ్నించారు.
Pakistan Afghanistan War: “సూసైడ్ స్వ్కాడ్” సిద్ధం చేసిన తాలిబాన్లు.. పాకిస్తాన్కు మూడినట్లే..
బీఆర్ఎస్ ఓటమికి లిక్కర్ కేసు కారణమనే వాదనను తోసిపుచ్చిన కవిత, అసలు కారణాలను ఎండగట్టారు. నియోజకవర్గాల్లో ప్రజలు వ్యతిరేకిస్తున్నా సరే దోపిడీదారులైన అభ్యర్థులకే మళ్ళీ టికెట్లు ఇవ్వడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేకపోవడం , పార్టీ నేతల్లో పెరిగిపోయిన అహంకారమే ఓటమికి దారితీశాయని ఆమె కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు వచ్చిన కోర్టు తీర్పును తమకు అనుకూలంగా మలుచుకుని తనను బలిపశువును చేయొద్దని కేటీఆర్కు స్పష్టం చేశారు. మొదటి నుండి తాను చెబుతున్నట్లే ఈ కుట్రపూరిత కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టు తీర్పు ద్వారా నిరూపితమైందని, తాను కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
Botsa Satyanarayana: ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్..
