Pendem Dora Babu: సీఎం వీడియో కాన్ఫరెన్స్కు దూరంగా పిఠాపురం ఎమ్మెల్యే

Pitapuram Mla

Pitapuram Mla

Pendem Dora Babu: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ కు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరుకాలేదు. మంగళగిరిలోని సెక్రటేరియట్ నుంచి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. జనవరి నెలలో అమలు చేసే పథకాలకి సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి దాడిశెట్టి రాజాతో సహా జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే ఈ భేటీకి మాత్రం పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు డుమ్మా కొట్టారు.

Read Also: Minister Adimulapu: సీఐటీయూతో చర్చలు.. మూడు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకారం.

×
×
Ad

ఈసారి పిఠాపురం సీటు పెండెం దొరబాబుకు ఇవ్వడానికి ముఖ్యమంత్రి నిరాకరించారు. పిఠాపురం ఎమ్మెల్యే సీటు వేరే అభ్యర్థికి ఇవ్వాలని సీఎం స్పష్టం చేయడంతో.. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దొరబాబు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో.. గత వారం నుంచి తన నియోజకవర్గంలో సొంత వర్గాన్ని మెయింటైన్ చేస్తున్నారు దొరబాబు. అంతేకాకుండా.. ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా దొరబాబు పాల్గొనడం లేదు. అయితే ఈ అంశంపై జిల్లాలో ఆసక్తికర చర్చ జరగుతోంది. అయితే త్వరలోనే దొరబాబు పార్టీ మారే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: Qatar Court: 8 మంది భారత నేవీ మాజీ అధికారుల ఉరిశిక్ష వ్యవహారం.. మరణశిక్షను జైలుశిక్షగా తగ్గింపు!