Annavaram Prasadam: అన్నవరం ప్రసాదానికి అరుదైన గుర్తింపు…
- అన్నవరం ప్రసాదానికి అరుదైన గుర్తింపు..
- 133 ఏళ్ల నుంచి తయారవుతున్న సత్యదేవుని ప్రసాదం..
- ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annavaram Prasadam: అన్నవరం ప్రసాదానికి అరుదైన గుర్తింపు లభించింది.. 133 ఏళ్ల నుంచి తయారవుతున్న సత్యదేవుని ప్రసాదానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తింపు వచ్చింది.. ఎక్కడ రాని ఈ రుచికి భక్తులు ఎంతో ఆస్వాదిస్తూ ఉంటారు.. సాంకేతికంగా అన్ని రంగాల్లో మార్పులు వచ్చినా.. ఇక్కడ మాత్రం విస్తరాకులలోనే స్వామివారి ప్రసాదాలను విక్రయాలు చేస్తారు..
Read Also: Kolkata Murder Case : నేడు సుప్రీంకోర్టులో విచారణ.. సీబీఐ స్టేటస్ రిపోర్ట్ సమర్పించే ఛాన్స్
Also Read
- Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
- MLC Anantha Babu Arrest: బిగ్ బ్రేకింగ్.. ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్..
- Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..
- TDP vs Janasena Clash: పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన.. మాజీ ఎమ్మెల్యే వర్మ ఫైర్..
అన్నవరం సత్యదేవుని ఆలయం 1891లో ప్రతిష్టించబడింది.. అప్పటినుంచి భక్తులకు గోధుమ రవ్వ ప్రసాదాన్ని అందిస్తున్నారు.. అన్నవరం ప్రసాదం అంటే భక్తులకు ఎంత ప్రీతి ప్రాతమో చెప్పనవసరం లేదు.. భారత ఆహార ప్రమాణాల సంస్థ తాజాగా ఈ ప్రసాదానికి గుర్తింపు ఇచ్చింది. ఏటా రెండు కోట్లకు పైగా ప్రసాదాలు విక్రయాలు జరుగుతూ ఉంటాయి.. ఒక ప్రసాదం ద్వారానే దాదాపు 40 కోట్ల ఆదాయం వస్తుంది.. కోట్లాదిమంది మనసులు దోచే అన్నవరం ప్రసాదం తయారు చేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.. స్థానికంగా దొరికే దినుసులతో ప్రసాదం తయారు చేయరు.. మధ్యప్రదేశ్ నుంచి మల్వరాజ్ గోధుమలను దిగుమతి చేసుకుంటారు.. వాటిని గ్రైండ్ చేయడానికి ప్రత్యేక యంత్రాలు వాడుతారు.. గతంలో ఈ ప్రసాదానికి ఐఎస్ఓ గుర్తింపు కూడా లభించింది.. సత్య దేవుడి ప్రసాదం ఇప్పటికీ విస్తరాకుల్లోనే భక్తులకు అందిస్తున్నారు.. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ప్లాస్టిక్ కవర్లలో కాకుండా విస్తరాకులే వినియోగిస్తున్నారు.. అత్యంత వేడి కలిగిన ఈ ప్రసాదం విస్తరాకులలో వేయగానే ఆవిరి సుగంధద్రవ్యాలతో ఆకు మధురంగా మారుతుంది.. ఈ విస్తరాకులను ఏజెన్సీ ప్రాంతం నుంచి తీసుకొస్తారు.. బయట ఈ ప్రసాదం తయారీ ట్రై చేసిన ఆ రుచి మాత్రం రాదు.
Read Also: IND vs BAN: బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు భారత జట్టు ప్రకటన..
150 గ్రాములు ప్రసాదాన్ని 20 రూపాయలకు విక్రయిస్తూ ఉంటారు.. 24 గంటలు భక్తులకు అందుబాటులో ఉండేలా దేవస్థానం చర్యలు చేసుకుంటుంది.. ప్రసాదం తయారు చేసే స్వాములు కూడా అత్యంత నిష్టతో ఉంటారు.. ప్రసాదం తయారీకి 3:2:1 నిష్పత్తిలో దినుసులు వేస్తారు.. 45 లీటర్ల నీటిని బాగా మరిగించి 15 కిలోల గోధుమలు వేస్తారు.. అరగంట ఉడికిన తర్వాత 30 కిలోల పంచదారను కళాయిలో వేసి ఉడికిస్తారు.. స్వచ్ఛమైన ఆవు నెయ్యి యాలకుల పొడిని కలుపుతారు ఆ తరువాత గంటసేపు వంట స్వాములు బాకు తో తిప్పుతారు.. ఆ తర్వాత ట్రాలీ తొట్టెలో వేసి మూడు గంటలు పాటు ఉంచుతారు… తెలుగు రాష్ట్రాల్లోనే అన్నవరం సత్యదేవుడు ప్రసాదం ఎంతో ఫేమస్.. అడ్డాకులో వేసి భక్తులకు విక్రయిస్తారు.. రుచి సూచీలో తిరుగులేదు భారత ఆహార ప్రమాణాల సంస్థ పూర్తిగా పరిశీలించి గుర్తింపు ఇచ్చింది.. రాజకీయ నాయకులు ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ ప్రసాదాన్ని తీసుకుని వెళ్తారు అలా అయితే తమ పనులు అవుతాయని లెక్కలు వేస్తారు.. మొత్తానికి అన్నవరం సత్యదేవుని ప్రసాదానికి భారత ఆహార ప్రమాణ సంస్థ గుర్తింపు లభించింది.. రుచి, శుచిలో ఎక్కడ వెనక్కి తగ్గకుండా వ్యవహరిస్తున్నది దేవస్థానం.. పాత సాంప్రదాయాలను కొనసాగిస్తూనే ప్రసాదం విషయంలో మాత్రమే ఎక్కడా రాజీ పడడం లేదు.. అరుదైన గుర్తింపుతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!