Annavaram Prasadam: అన్నవరం ప్రసాదానికి అరుదైన గుర్తింపు…
- అన్నవరం ప్రసాదానికి అరుదైన గుర్తింపు..
- 133 ఏళ్ల నుంచి తయారవుతున్న సత్యదేవుని ప్రసాదం..
- ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annavaram Prasadam: అన్నవరం ప్రసాదానికి అరుదైన గుర్తింపు లభించింది.. 133 ఏళ్ల నుంచి తయారవుతున్న సత్యదేవుని ప్రసాదానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తింపు వచ్చింది.. ఎక్కడ రాని ఈ రుచికి భక్తులు ఎంతో ఆస్వాదిస్తూ ఉంటారు.. సాంకేతికంగా అన్ని రంగాల్లో మార్పులు వచ్చినా.. ఇక్కడ మాత్రం విస్తరాకులలోనే స్వామివారి ప్రసాదాలను విక్రయాలు చేస్తారు..
Read Also: Kolkata Murder Case : నేడు సుప్రీంకోర్టులో విచారణ.. సీబీఐ స్టేటస్ రిపోర్ట్ సమర్పించే ఛాన్స్
Also Read
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
అన్నవరం సత్యదేవుని ఆలయం 1891లో ప్రతిష్టించబడింది.. అప్పటినుంచి భక్తులకు గోధుమ రవ్వ ప్రసాదాన్ని అందిస్తున్నారు.. అన్నవరం ప్రసాదం అంటే భక్తులకు ఎంత ప్రీతి ప్రాతమో చెప్పనవసరం లేదు.. భారత ఆహార ప్రమాణాల సంస్థ తాజాగా ఈ ప్రసాదానికి గుర్తింపు ఇచ్చింది. ఏటా రెండు కోట్లకు పైగా ప్రసాదాలు విక్రయాలు జరుగుతూ ఉంటాయి.. ఒక ప్రసాదం ద్వారానే దాదాపు 40 కోట్ల ఆదాయం వస్తుంది.. కోట్లాదిమంది మనసులు దోచే అన్నవరం ప్రసాదం తయారు చేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.. స్థానికంగా దొరికే దినుసులతో ప్రసాదం తయారు చేయరు.. మధ్యప్రదేశ్ నుంచి మల్వరాజ్ గోధుమలను దిగుమతి చేసుకుంటారు.. వాటిని గ్రైండ్ చేయడానికి ప్రత్యేక యంత్రాలు వాడుతారు.. గతంలో ఈ ప్రసాదానికి ఐఎస్ఓ గుర్తింపు కూడా లభించింది.. సత్య దేవుడి ప్రసాదం ఇప్పటికీ విస్తరాకుల్లోనే భక్తులకు అందిస్తున్నారు.. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ప్లాస్టిక్ కవర్లలో కాకుండా విస్తరాకులే వినియోగిస్తున్నారు.. అత్యంత వేడి కలిగిన ఈ ప్రసాదం విస్తరాకులలో వేయగానే ఆవిరి సుగంధద్రవ్యాలతో ఆకు మధురంగా మారుతుంది.. ఈ విస్తరాకులను ఏజెన్సీ ప్రాంతం నుంచి తీసుకొస్తారు.. బయట ఈ ప్రసాదం తయారీ ట్రై చేసిన ఆ రుచి మాత్రం రాదు.
Read Also: IND vs BAN: బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు భారత జట్టు ప్రకటన..
150 గ్రాములు ప్రసాదాన్ని 20 రూపాయలకు విక్రయిస్తూ ఉంటారు.. 24 గంటలు భక్తులకు అందుబాటులో ఉండేలా దేవస్థానం చర్యలు చేసుకుంటుంది.. ప్రసాదం తయారు చేసే స్వాములు కూడా అత్యంత నిష్టతో ఉంటారు.. ప్రసాదం తయారీకి 3:2:1 నిష్పత్తిలో దినుసులు వేస్తారు.. 45 లీటర్ల నీటిని బాగా మరిగించి 15 కిలోల గోధుమలు వేస్తారు.. అరగంట ఉడికిన తర్వాత 30 కిలోల పంచదారను కళాయిలో వేసి ఉడికిస్తారు.. స్వచ్ఛమైన ఆవు నెయ్యి యాలకుల పొడిని కలుపుతారు ఆ తరువాత గంటసేపు వంట స్వాములు బాకు తో తిప్పుతారు.. ఆ తర్వాత ట్రాలీ తొట్టెలో వేసి మూడు గంటలు పాటు ఉంచుతారు… తెలుగు రాష్ట్రాల్లోనే అన్నవరం సత్యదేవుడు ప్రసాదం ఎంతో ఫేమస్.. అడ్డాకులో వేసి భక్తులకు విక్రయిస్తారు.. రుచి సూచీలో తిరుగులేదు భారత ఆహార ప్రమాణాల సంస్థ పూర్తిగా పరిశీలించి గుర్తింపు ఇచ్చింది.. రాజకీయ నాయకులు ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ ప్రసాదాన్ని తీసుకుని వెళ్తారు అలా అయితే తమ పనులు అవుతాయని లెక్కలు వేస్తారు.. మొత్తానికి అన్నవరం సత్యదేవుని ప్రసాదానికి భారత ఆహార ప్రమాణ సంస్థ గుర్తింపు లభించింది.. రుచి, శుచిలో ఎక్కడ వెనక్కి తగ్గకుండా వ్యవహరిస్తున్నది దేవస్థానం.. పాత సాంప్రదాయాలను కొనసాగిస్తూనే ప్రసాదం విషయంలో మాత్రమే ఎక్కడా రాజీ పడడం లేదు.. అరుదైన గుర్తింపుతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!