Woman Constable Jayasanthi: ట్రాఫిక్ క్లియర్ చేసి అడ్డంగా దొరికిపోయిన మహిళా కానిస్టేబుల్.. తీవ్ర వివాదం..!
- వివాదంగా మారిన రంగంపేట మహిళా కానిస్టేబుల్ జయశాంతి వ్యవహారం..
- గత ఏడాది జరిగిన డీఎస్సీలో తప్పుడు సర్టిఫికెట్ తో ఉద్యోగం పొందిన కానిస్టేబుల్..
- కానిస్టేబుల్ గా ఉన్న భర్త తాతారావు సంపాదన దాచి..
- తండ్రిని సంరక్షకుడిగా ప్రస్తావిస్తూ ఈ డబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పొందినట్లు నిర్ధారణ..
- విచారణ చేసి డీఎస్సీ ఉద్యోగం రద్దు చేసిన విద్యాశాఖ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Constable Jayasanthi: రంగంపేట మహిళా కానిస్టేబుల్ జయశాంతి వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది.. చంటి బిడ్డను ఎత్తుకుని.. ట్రాఫిక్ క్లియర్ చేసిన ఓ వీడియో బయటకు రావడంతో.. ఆమె వైరల్గా మారిపోయింది.. ఆమెకు మద్దతుగా ఎంతోమంది పోస్టులు పెట్టారు.. ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఆమెను అభినందించారు.. అంతేకాదు.. హోం మంత్రి అనిత.. ఆమెను ఇంటికి పిలిచి భోజనం పెట్టి మరి సన్మానించారు.. కానీ, ఇప్పుడు అసలు కథ బయటకు రావడంతో దుమారమే రేగుతోంది..
Read Also: Ratha Saptami 2026: రేపే రథ సప్తమి- ఈ విధంగా స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి పక్కా!
Also Read
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
అయితే, గత ఏడాది జరిగిన డీఎస్సీలో తప్పుడు సర్టిఫికెట్ తో ఉద్యోగం పొందింది జయశాంతి.. కానిస్టేబుల్ గా ఉన్న భర్త తాతారావు సంపాదన దాచి తండ్రిని సంరక్షకుడిగా ప్రస్తావిస్తూ ఈ డబ్ల్యూ ఎస్ సర్టిఫికెట్ పొందినట్లు నిర్ధారణ అయింది.. విచారణ చేసి డీఎస్సీ ఉద్యోగం రద్దు చేశారు విద్యాశాఖ అధికారులు.. ప్రభుత్వాన్ని మోసం చేసిందని చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి ఎస్పీకి రిఫర్ చేశారు కాకినాడ డీఈవో.. ఇక, నకిలీ ఐడీ కార్డుతో ఎస్సై గా చలామణి అవుతున్న కామేశ్వరరావు అనే హెడ్ కానిస్టేబుల్ కి సహకారం అందించారు జయశాంతి, ఇటీవల చంటి బిడ్డను ట్రాఫిక్ క్లియర్ చేసి వార్తలలో నిలిచారు.. అది కూడా ప్లాన్ ప్రకారం జరిగిందని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి పల్నాడు ఎస్పీఎఫ్ కి జయశాంతి భర్త తాతారావు గతంలో బదిలీ అయ్యారు.. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రైల్వే నుంచి లా అండ్ ఆర్డర్ కు జయశాంతిని బదిలీ చేశారు.. భార్యాభర్తలపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా చర్యలు తీసుకోవడం, డీఎస్సీలో తప్పుడు ధృవీకరణ పత్రంతో ఉద్యోగం సంపాదించడంతో విమర్శలు రావడంతోనే చంటి బిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసినట్లు హడావిడి చేసిందని విమర్శలు వస్తున్నాయి.. తన పరిధి కాకపోయినా చంటి బిడ్డను ఎత్తుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారని ఇంటికి ఆహ్వానించి కానిస్టేబుల్ జయశాంతి దంపతులను సన్మానించారు హోంమంత్రి అనిత.. ఇప్పుడు వివాదం బయటకు రావడంతో.. ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది..
తాజావార్తలు
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
-
NBKxKoratalaSiva : పుకార్లు సృష్టిస్తే దబిడి దిబిడే.. బాలయ్య – కొరటాల శివ సినిమాపై టీమ్ క్లారిటీ
-
DC Beats Jana Nayagan: కేరళలో ‘డీసీ’ దూకుడు.. విజయ్ రికార్డుకు బ్రేక్, ఇప్పుడు రూ.100 కోట్ల టార్గెట్
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Dare Devil: అజిత్ ‘డేర్ డెవిల్’ నుంచి తప్పుకున్న మోహన్లాల్.. సెప్టెంబర్ నుంచి షూటింగ్
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!