Jogi Ramesh – Meruga Nagarjuna: ఆ ఘనత ఒక్క జగన్కే సాధ్యం.. వాళ్ల శక్తి చాలదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jogi Ramesh Meruga Nagarjuna Celebrated Praja Sankalpa Yatra 5 Years Ceremony: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా.. పార్టీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాదయాత్రలో వైఎస్ జగన్తో నడిచిన వారిని సన్మానించారు. ఈ వేడుకలకు మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, మండలి విప్ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ వాసుబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను సైతం వాళ్లు ప్రారంభించారు. అనంతరం.. పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకొని, వాటిని మ్యానిఫెస్టోలో పెట్టి, అందులో 98 శాతం పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని నేతలు పేర్కొన్నారు.
మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. అణగారిన వర్గాలకు భరోసా ఇచ్చిన నేత వైఎస్ జగన్ అని అన్నారు. తన యాత్రతో ప్రజల సమస్యలను తెలుసుకున్న ఆయన, వాటిని మ్యానిఫెస్టోలో పెట్టి, 98 శాతం పూర్తి చేశారన్నారు. బలవంతుడైన జగన్ని ఎదుర్కోవాలంటే.. వాళ్ల శక్తి చాలదంటూ ప్రతిపక్షాలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అందుకే ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చూస్తున్నారని ఆరోపించారు. జగన్ సర్కారుని కూల్చడానికి.. ఇదేమీ పేక మేడనో, సినిమా సెట్టింగో కాదని కౌంటర్లు వేశారు. ప్రజల నుంచి జగన్ను ఎవ్వరూ వేరు చేయలేరన్నారు. కూలిపోయిన టీడీపీ.. వైఎస్సార్సీపీ కంచుకోటను ఏమాత్రం కదిలించలేదని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ లక్ష్యం 175 సీట్లు అని.. చంద్రబాబు సహా అందరినీ ఓడించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
Also Read
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
- APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్పై భారీ విజయం.!
ఇక మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం అపహాస్యం అయినప్పుడు జగన్ పాదయాత్ర చేపట్టారన్నారు. ప్రజల కోసం ఆయన సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు. ఆ పాదయాత్ర నేడు రాష్ట్రంలో సంక్షేమ రాజ్యానికి నాంది పలికిందని, భావి తరాలకు బంగారు బాట వేయడానికి అవకాశం కల్పించిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన నేత వైఎస్ జగన్ అని.. రాష్ట్రానికి జగన్ ఒక అంబేడ్కర్, జగజ్జీవన్ రామ్లాగా నిలుస్తున్నారని చెప్పారు. ఐదేళ్ల క్రితం ఒక గొప్ప యజ్ఞం ప్రారంభమైతే.. దాని ఫలాలు నేడు ప్రజలకు అందుతున్నాయన్నారు. పాదయాత్ర పేటెంట్ ఒక్క వైఎస్ కుటుంబానికే దక్కుతుందని వెల్లడించారు.
తాజావార్తలు
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!