Jagan Cabinet: పశ్చిమగోదావరిలో బెర్త్ ఎవరికి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి త్వరలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో రెండేళ్ళపాటు అమాత్య పదవి పొందేందుకు వివిధ జిల్లాల నుంచి పోటీ తీవ్రతరం అయింది. అధికారంలో వుండే ఏ పార్టీకి అయినా ఉభయ గోదావరి జిల్లాలు ఆయువుపట్టు. అక్కడ ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీయే అధికారం చేపడుతుంది. ఈ సంప్రదాయం, సెంటిమెంట్ ఎప్పటినుంచో వస్తోంది.
పశ్చిమ గోదావరి జిల్లాలో 2019 ఎన్నికల్లో రెండుచోట్ల మాత్రమే టీడీపీ అభ్యర్ధులు గెలిచారు. పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు, ఉండి నుంచి రామరాజు ఎమ్మెల్యేలు అయ్యారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ముగ్గురికి మంత్రి పదవులు లభించిన సంగతి తెలిసిందే. ఆళ్ళనాని, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత లక్కీ ఛాన్స్ కొట్టేశారు. రెండున్నరేళ్ళ తర్వాత మంత్రిమండలిని మారుస్తానని జగన్ ఆనాడే ప్రకటించారు. అయితే కాస్త ఆలస్యం అయింది. తాజాగా మంత్రి మండలిలో కొత్తవారిని తీసుకోవడానికి రంగం సిద్ధం అయింది. జిల్లాకు చెందిన ఆశావహులు మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్లస్, మైనస్ లను బేరీజు వేసుకోవడంతో మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనేది చర్చనీయాంశంగా మారింది. జిల్లాకు దక్కే మంత్రి పదవులు ఎన్ని? ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయనేది చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ప్రధానంగా ఐదుగురు మంత్రి మంత్రి పదవుల కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read
- Prepaid Electricity System: ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం.. స్మార్ట్ మీటర్లతో అమల్లోకి కొత్త వ్యవస్థ
- CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
- Sajjala Ramakrishna Reddy: హామీలు గాలికొదిలేశారు.. సర్కార్పై సజ్జల తీవ్ర విమర్శలు..
- Eluru Tragedy: ఏలూరు జిల్లాలో విషాదం.. జీడి మామిడి తోటలో తల్లీకూతుళ్ల అనుమానాస్పద మృతి!
పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాసరావు, నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. వీరిలో ముగ్గురికి పదవులు దక్కే అవకాశం ఉంది. వీరిలో గ్రంధి శ్రీనివాస్, బాలరాజు, తలారి వెంకట్రావు ముందు వరుసలో ఉన్నారు. క్షత్రియ సామాజిక వర్గం నుంచి ప్రస్తుత మంత్రి శ్రీరంగనాథరాజుని తప్పిస్తే ముదునూరి ప్రసాదరాజుకి అవకాశం రావచ్చని ప్రచారం సాగుతోంది.
భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గడిచిన ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గెలుపొందడం ప్లస్ పాయింట్, మొదటి నుండి వెన్నంటి ఉన్నవారిని దూరం పెట్టడం, సామాజిక వర్గాల వారికి సమదూరం పాటించడం మైనస్ గా మారింది.బాలరాజు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి మొదటి నుండి దగ్గరగా ఉన్న వారిలో ఒకరు కావడం ప్లస్ పాయింట్. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలను పూర్తి స్థాయిలో ఆదుకోకపోవడం మైనస్ .
రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో కొవ్వూరు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితను తప్పించే పరిస్థితి నెలకొంది. ఇదే జరిగితే వనిత సామాజిక వర్గానికి చెందిన గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. పార్టీలో సీనియర్ నాయకులు కావడం కలిసి వచ్చే అవకాశం. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పలు అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు.ఈయనకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ తక్కువగా ఉంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ మదిలో ఏముందో? జిల్లా నుంచి కేబినెట్లో బెర్త్ దొరికేది ఎవరికో చూడాలి.
తాజావార్తలు
-
Telangana Farmers: ఆ రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. టన్నుకు రూ.351 పెంపు..
-
Origin of Telangana: ‘తెలంగాణ’ పేరు ఎప్పడిదో తెలుసా? వందల ఏండ్ల కిందటి ఈ సీక్రెట్ హిస్టరీ సూస్తే మైండ్ పోవాల్సిందే!
-
El Nino-Centre: ఎల్నినోపై కేంద్రం అలర్ట్.. వాటి విషయంలో ఆందోళన అక్కర్లేదని భరోసా
-
Pawan Kalyan: పవన్ కల్యాణ్కు తెలంగాణ పోలీసుల షాక్.. నో పర్మిషన్..
-
Vaibhav Vs Jaiswal: పాపం యశస్వి జైస్వాల్.. ‘ఎంత పని చేశావ్ వైభవ్ సూర్యవంశీ’..
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!