ఏపీని ‘రౌండప్’ చేస్తున్న జనసేన?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా జనసేన గురించే చర్చ నడుస్తోంది. కొద్దిరోజులుగా వైసీపీ, జనసేన మధ్య మాటలయుద్ధం నడుస్తున్న సంగతి అందరికీ తెల్సిందే. జనసేన చేపట్టిన రోడ్ల ఉద్యమానికి స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ విషయంలో ఒకరకంగా జనసేనాని వైసీపీ సర్కారుపై పైచేయి సాధించిందనే టాక్ సైతం విన్పించింది. ఇదే సమయంలో జనసేనాని వీలుచిక్కినప్పుడల్లా ఏపీ సర్కారును టార్గెట్ చేస్తూ విమర్శల దాడికి దిగుతున్నారు. ప్రతీగా వైసీపీ నేతలు సైతం ఎదురుదాడికి దిగుతూ రాజకీయాలను హీటెక్కిస్తున్నారు.
కొంతకాలంగా జనసేనాని యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలోనే వైసీపీ సర్కారు వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ సర్కారు ప్రధానంగా సంక్షే పథకాలపై ఫోకస్ పెట్టడంతో జనసేనాని దానినే టార్గెట్ చేస్తున్నట్లు కన్పిస్తోంది. ఏపీ ఆర్థిక పరిస్థితిపై చర్చకు తెరలేపే ప్రయత్నం పవన్ కల్యాణ్ చేయబోతున్నారని సమాచారం. తద్వారా వైసీపీని ఇరుకునపెట్టే ప్రయత్నం జనసేనాని చేయబోతున్నారు.
Also Read
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్ఫైర్, నో మిస్ఫైర్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
ఈమేరకు జనసేన మరోసారి రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. గతంలోనూ జనసేన పార్టీలు పలుమార్లు ఏపీలోని సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించింది. గతంలో కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, ఇతరత్ర అంశాలపై మేథావులతో కలిసి పవన్ కల్యాణ్ సమావేశాలు నిర్వహించారు. ఆ మాదిరిగానే ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టుగా మరోసారి పవన్ కల్యాణ్ ఏపీలోని కీలక అంశాలపై సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
దీనిలో భాగంగానే ఏపీ ఆర్థిక పరిస్థితిపై జనసేన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతుందని సమాచారం. ఈ సమావేశానికి మేధావులను పిలిచి ఏపీ ఆర్థిక లెక్కలను తేల్చనున్నారట. గత కొద్దిరోజులుగా పవన్ కల్యాణ్ ట్వీటర్లో ఏపీ ఆర్థిక పరిస్థితిపై ట్వీట్ చేస్తుండటంతో ఇందులో భాగమేనని తెలుస్తోంది. ‘తాకట్టులో ఆంధ్రప్రదేశ్’ అని ఒకసారి. ‘దివాళాదిశగా ఏపీ ఆర్థిక పరిస్థితి’ అంటూ మాట్లాడుతున్నారు. ఆరు లక్షల కోట్లకు పైగా అప్పుల్లో రాష్ట్రం కూడుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఏపీకి ఈ పరిస్థితి కారణం ఎవరంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు.
జనసేన ఆధ్వర్యంలో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశాన్ని అన్నిపార్టీల నేతలతోపాటు మేధావులను ఆహ్వానించనున్నారట. ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు, ఇతరత్రా వర్గాల నేతలు ఇందులో పాల్గొని చర్చించాలని జనసేనాని కోరుతున్నారు. టీడీపీ హయాంలో కేంద్ర సర్కారును ప్రశ్నించినట్లుగానే ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆయావర్గాలు నిలదీసేలా జనసేన ప్లాన్ చేస్తోంది. అయితే జగన్ సర్కారును ప్రశ్నించడానికి మేధావివర్గం ఏమేరకు ముందుకొస్తుందనే మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. మరీ జనసేన చేపట్టబోయే రౌండ్ సమావేశాలు ఏమేరకు ఫలితాన్ని ఇస్తాయనేది మాత్రం వేచిచూడాల్సిందే..!
తాజావార్తలు
-
Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!