ఏపీని ‘రౌండప్’ చేస్తున్న జనసేన?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా జనసేన గురించే చర్చ నడుస్తోంది. కొద్దిరోజులుగా వైసీపీ, జనసేన మధ్య మాటలయుద్ధం నడుస్తున్న సంగతి అందరికీ తెల్సిందే. జనసేన చేపట్టిన రోడ్ల ఉద్యమానికి స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ విషయంలో ఒకరకంగా జనసేనాని వైసీపీ సర్కారుపై పైచేయి సాధించిందనే టాక్ సైతం విన్పించింది. ఇదే సమయంలో జనసేనాని వీలుచిక్కినప్పుడల్లా ఏపీ సర్కారును టార్గెట్ చేస్తూ విమర్శల దాడికి దిగుతున్నారు. ప్రతీగా వైసీపీ నేతలు సైతం ఎదురుదాడికి దిగుతూ రాజకీయాలను హీటెక్కిస్తున్నారు.
కొంతకాలంగా జనసేనాని యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలోనే వైసీపీ సర్కారు వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ సర్కారు ప్రధానంగా సంక్షే పథకాలపై ఫోకస్ పెట్టడంతో జనసేనాని దానినే టార్గెట్ చేస్తున్నట్లు కన్పిస్తోంది. ఏపీ ఆర్థిక పరిస్థితిపై చర్చకు తెరలేపే ప్రయత్నం పవన్ కల్యాణ్ చేయబోతున్నారని సమాచారం. తద్వారా వైసీపీని ఇరుకునపెట్టే ప్రయత్నం జనసేనాని చేయబోతున్నారు.
Also Read
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
- Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
ఈమేరకు జనసేన మరోసారి రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. గతంలోనూ జనసేన పార్టీలు పలుమార్లు ఏపీలోని సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించింది. గతంలో కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, ఇతరత్ర అంశాలపై మేథావులతో కలిసి పవన్ కల్యాణ్ సమావేశాలు నిర్వహించారు. ఆ మాదిరిగానే ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టుగా మరోసారి పవన్ కల్యాణ్ ఏపీలోని కీలక అంశాలపై సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
దీనిలో భాగంగానే ఏపీ ఆర్థిక పరిస్థితిపై జనసేన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతుందని సమాచారం. ఈ సమావేశానికి మేధావులను పిలిచి ఏపీ ఆర్థిక లెక్కలను తేల్చనున్నారట. గత కొద్దిరోజులుగా పవన్ కల్యాణ్ ట్వీటర్లో ఏపీ ఆర్థిక పరిస్థితిపై ట్వీట్ చేస్తుండటంతో ఇందులో భాగమేనని తెలుస్తోంది. ‘తాకట్టులో ఆంధ్రప్రదేశ్’ అని ఒకసారి. ‘దివాళాదిశగా ఏపీ ఆర్థిక పరిస్థితి’ అంటూ మాట్లాడుతున్నారు. ఆరు లక్షల కోట్లకు పైగా అప్పుల్లో రాష్ట్రం కూడుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఏపీకి ఈ పరిస్థితి కారణం ఎవరంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు.
జనసేన ఆధ్వర్యంలో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశాన్ని అన్నిపార్టీల నేతలతోపాటు మేధావులను ఆహ్వానించనున్నారట. ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు, ఇతరత్రా వర్గాల నేతలు ఇందులో పాల్గొని చర్చించాలని జనసేనాని కోరుతున్నారు. టీడీపీ హయాంలో కేంద్ర సర్కారును ప్రశ్నించినట్లుగానే ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆయావర్గాలు నిలదీసేలా జనసేన ప్లాన్ చేస్తోంది. అయితే జగన్ సర్కారును ప్రశ్నించడానికి మేధావివర్గం ఏమేరకు ముందుకొస్తుందనే మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. మరీ జనసేన చేపట్టబోయే రౌండ్ సమావేశాలు ఏమేరకు ఫలితాన్ని ఇస్తాయనేది మాత్రం వేచిచూడాల్సిందే..!
తాజావార్తలు
-
IPL 2026: RCB Vs KKR మ్యాచ్కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే..
-
Naga Vamsi: డిస్ట్రిబ్యూటర్లను చంపి ఎగ్జిబిటర్లను కాపాడటం సాధ్యమా?:
-
Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
-
CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Amul milk: సామాన్యుడి జేబుకు ‘అముల్’ చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!