Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Hot Politics In Visakhapatnam Executive Capital

Visakha Capital politics: విశాఖలో వేడెక్కిన రాజధాని రాజకీయం

Published Date :September 24, 2022 , 9:39 am
By newsdesk
Visakha Capital politics: విశాఖలో వేడెక్కిన రాజధాని రాజకీయం
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీలో మూడురాజధానుల వ్యవహారం రసవత్తరంగా మారుతోంది. ముఖ్యంగా విశాఖ కేంద్రంగా రాజధాని రాజకీయం వేడెక్కుతోంది. అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానుల కోసం  ఉత్తరాంధ్రలో వైసీపీ ఉద్యమ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలను వినిపించే దిశలో తొలి ప్రయత్నంగా ఈనెల 25న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. మరోవైపు, అమరావతి రైతుల పాదయాత్రకు రక్షణ కవచంగా నిలనడతామని బీజేపీ ప్రకటించింది. నియంత్రించే సాహసం చెయ్యడం అంటే అది బీజేపీని అడ్డుకోవడం గానే భావించాల్సి వుంటుందని హెచ్చరిస్తోంది.

ఉత్తరాంధ్రలో మరోసారి కార్యనిర్వాహక రాజధాని డిమాండ్ కు ఊపు తీసుకుని వచ్చే విధంగా ఉద్యమ కార్యాచరణ సిద్ధమైంది. అమరావతి రైతుల పాదయాత్రను ఈ ప్రాంతంపై జరుగుతున్న దండయాత్ర కనుక అడ్డుకుంటామని స్వయంగా మంత్రులు ప్రకటిస్తున్నారు. రాజకీయాలు, పార్టీల కంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి ఆకాంక్షల నుంచి పుట్టిన కేపిటల్ నినాదం తమ విధానమని స్పష్టంగా చెబు తోంది. ఇప్పటికే విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా మూడు రాజధానులకు అనుకూల  ప్రదర్శనలు జరుగుతున్నాయి. తొలుత ఈ నెల 25 న రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తోంది.

Read Also: Uttar Pradesh: అత్యాచారానికి పాల్పడ్డితే ఇక అంతే.. కొత్త బిల్లు తీసుకువచ్చిన యోగి సర్కార్

అందులో భవిష్యత్ కార్యాచరణ ను నిర్దేశించబోతున్నట్టు మంత్రి అమర్నాథ్ ప్రకటించారు. ఆ దిశగా చేసే ప్రయత్నాలు పార్టీ వేదికగా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకోసం వ్యూహాత్మకంగా ముందుకు కదులుతూ ఉంది. ఇప్పటి వరకు స్టూడెంట్, ఇంటిలెక్చువల్ జె.ఏ.సీ.లు మూడు రాజధానుల డిమాండ్ విన్పిస్తున్నా అంత ఎఫెక్టివ్ గా కనిపించడం లేదు. అందుకే వ్యూహాత్మకంగా ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశం పేరుతో ఆదివారం ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. అందులో వచ్చే సలహాల అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ఉండబోతోంది. ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర అధికార పార్టీ నేతలంతా హాజరు కానున్నారు. సీనియర్ మంత్రులు బొత్సా సత్యనారాయణ, డిప్యూటీ సిఎం లు ముత్యాలనాయుడు, రాజన్న దొర సహా ఎమ్మెల్యే లు, ముఖ్యలు అంతా హాజరుకానున్నారు.

ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర అభివృద్ది ని కాంక్షించే వాళ్లంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్. రాజకీయ పార్టీలకు కూడా ఈ పిలుపు వర్తిస్తుందని ప్రకటించారు. అదే సమయంలో ఉత్తరాంధ్ర వైపు వచ్చే పాదయాత్రను రైతులు విరమించుకుంటే మంచిదని సూచిస్తున్నారు అమర్నాథ్. మూడు రాజధానులపై బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలపైన మండిపడుతున్నారు.మూడు రాజధానుల విధానంను వైసీపీ తప్ప మిగతా అన్నీ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అందుకే  ఉత్తరాంధ్ర అభివృద్ది ని కాంక్షించే అందరినీ భాగస్వామ్యులు అయ్యే విధంగా ప్లాన్ చేస్తోంది వైసీపీ. విశాఖ రాజధాని కావాలని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలపై చర్చించనున్నారు.

దశల వారీగా ప్రజలను చైతన్యం చేసేందుకు పెద్ద యెత్తున సమావేశాలు, సభలు నిర్వహించాలని నిర్ణయించే అవకాశం ఉంది. ఇప్పటికే గడపగడపకు మూడు రాజధానులు నినాదం,వాటి వల్ల ఉత్తరాంధ్రకు జరిగే మేలును ప్రచారంలోకి తీసుకు ని వచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి సమావేశం కీలకం కాబోతోంది. ఐతే, అమరావతి రైతుల పాదయాత్ర, మూడు రాజధానులపై వైసీపీ ప్రకటనలు,ప్రసంగాలను బీజేపీ సీరియస్ గానే తీసుకున్నట్టు కనిపిస్తోంది. రైతులను అడ్డుకోవడం అంటే బీజేపీని అడ్డుకోవడంగానే భావిస్తామన్నారు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్. ఉత్తరాంధ్ర అభివృద్ధి, ఆకాంక్షలే ప్రధానంగా కలిసి వచ్చే పార్టీలతో వెళ్తామని, ముడురాజధానులను స్వాగతించే వారిని ఆహ్వానిస్తామని వైసీపీ చెబుతోంది.

Read Also: Vizag Fishing Harbour: విశాఖ కంటైనర్ టెర్మినల్ వద్ద ఉద్రిక్తత… మత్స్యకారుల ఆందోళన

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amaravati yatra
  • bjp vs ysrcp
  • cm jagan
  • Executive capital issue
  • minister amarnath

తాజావార్తలు

  • Toxic : వాయిదా వేసి ధురంధర్ 2 దాడి నుండి తప్పించుకున్న ‘టాక్సిక్’

  • Dhurandhar 2 Box Office: రంజాన్ వేళ రికార్డుల వేట.. బాక్సాఫీస్ వద్ద ‘ధురందర్: ది రివెంజ్’ అరాచకం!

  • RCB Predicted Playing XI: తొలి మ్యాచ్‌కు ఆర్సీబీ రెడీ.. RCB కొత్త ప్లేయింగ్ XI లీక్!

  • Dasun Shanaka-IPL 226: ఐపీఎల్ ప్రభావం.. శ్రీలంక కెప్టెన్ దసున్ షనక కీలక నిర్ణయం!

  • Dhurandhar : The Revenge : ‘ధురంధర్’ విధ్వంసం.. 3 రోజుల్లోనే రూ. 500 కోట్లు.. ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్ అరాచకం!

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions