కర్ణాటకలోని జిల్లాలో కుందాపూర్, ఉడుపి, బిందూర్లో మొదలైన హిజాబ్ వివాదం.. క్రమంగా మిగతా ప్రాంతాలకు పాకింది.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ను కూడా తాకింది.. బుర్కా వేసుకొచ్చామన్న కారణంతో కాలేజీ యాజమాన్యం అనుమతించడం లేదంటూ విజయవాడలోని లయోలా కాలేజీలో ముస్లిం విద్యార్థినులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.. బుర్కా వేసుకొచ్చారన్న కారణంతో లోపలికి అనుమతించడం లేదంటూ విద్యార్థినులు తెలిపారు.. దీనిపై విద్యార్థినుల కుటుంబసభ్యులు, ముస్లిం పెద్దలు కూడా ఆందోళన చేసిన సంగతి మరువక ముందే.. ఇప్పుడు మరో చోట హిజాబ్ వివాదం తెరపైకి వచ్చింది..
Read Also: Gunfire: హైదరాబాద్లో కాల్పుల కలకలం.. దారి దోపిడీ..
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని వికాస్ హైస్కూల్లో ఈ రోజు హిజాబ్ వివాదం తలెత్తింది.. ముస్లిం విద్యార్థినులు హిజాబ్ తీసి స్కూల్లోకి రావాలంటూ అడ్డుకుంది స్కూల్ యాజమాన్యం… దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన విద్యార్థినులు, ముస్లిం మహిళలు, మత పెద్దలు.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ కొత్త రూల్స్ ఏంటి అంటూ స్కూల్ని ముట్టడించారు.. స్కూల్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు.. దీంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.