High Court status quo: గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టు స్టేటస్ కో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court status quo: గుంటూరులో గ్రానైట్ తవ్వకాలపై కీలక ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. గ్రానైట్ తవ్వకాలపై స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది.. గ్రానైట్ తవ్వకాలు నిలిపివేయాలంటూ గుంటూరు జిల్లా చిలకలూరపేటలో మురికిపుడి రైతులు హైకోర్టును ఆశ్రయించారు.. దీనిపై గతంలో విచారణ జరిపి మంత్రి విడదల రజనీ సహా పలువురికి నోటీసులు జారీ చేసింది హైకోర్టు.. ఇక, ఈ రోజు మరోసారి విచారణ చేపట్టిన కోర్టు.. స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది..
Read Also: CPI Narayana: టీడీపీ, జనసేనతో కలిసే పోటీచేస్తాం..
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
కాగా, ఈ కేసులో మంత్రి విడదల రజనీ, ఎంపీ అవినాష్ రెడ్డి మామ ప్రతాప్ రెడ్డి, మరదలు స్వేతారెడ్డి, జీవీ దినేష్ రెడ్డి, శివపార్వతులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు.. అయితే, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూముల్లో డీకే పట్టాలు రద్దుచేయకుండా గ్రానైట్ తవ్వకాలకు ఎన్వోసీ ఇవ్వడంపై హైకోర్టులో రైతులు పిటిషన్ వేశారు.. ఈ పిటిషన్ తరపున వాదనలు వినిపించారు న్యాయవాది వీవీ లక్ష్మినారాయణ.. మొత్తం 21 ఎకరాల 50 సెంట్లు భూమిలో గ్రానైట్ తవ్వకాలకు ఎన్వోసీ ఇచ్చిన ఎమ్మార్వోకు, రైతులు పనులు చేస్తుంటే అడ్డుకున్న ఎస్సైకి కూడా నోటీసులు ఇచ్చింది.. ఒక్కో ఎకరాలో 200 కోట్లు విలువ చేసే గ్రానైట్ నిల్వలు ఉన్నాయని అంచనా ఉండగా.. రైతులకు తెలియకుండానే ఎన్వోసీ ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.. ఇక, దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, వచ్చేనెల 10 వ తేదీకి కేసు విచారణ వాయిదా వేసింది.. అప్పటి వరకు స్టేటస్ కో ఉత్తర్వులు. కౌంటర్ లు దాఖలు చేయాలని మంత్రి, ఇతరులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!