Nadendla Manohar: తెనాలి జనసేన కార్యాలయంలో భోగి మంటలు..
- తెనాలిలోని జనసేన కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు..
- భోగి మంటలను వెలిగించిన మంత్రి నాదెండ్ల మనోహర్..
- భోగి వేడుకల్లో పాల్గొన్న వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar: గుంటూరు జిల్లా తెనాలిలోని జనసేన కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.. జనసేన పార్టీ కార్యాలయంలో భోగి మంటలను వెలిగించారు మంత్రి నాదెండ్ల మనోహర్.. భోగి వేడుకల్లో వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం ఆనందంతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం.. గత నాలుగైదు సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న రైతాంగానికి కూటమి ప్రభుత్వం అండగా నిలబడిందన్నారు.. గత ప్రభుత్వం రైతులకు బకాయి పెట్టిన 1674 కోట్ల బకాయిలను కోటం ప్రభుత్వం రాగానే వారి ఖాతాలో జమ చేశాము.. రైతులు వద్ద ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపే వారి ఖాతాల్లో నగదు జమ చెయ్యటం ద్వారా ముందుగానే సంక్రాంతి వచ్చిందని భావన రైతులు వ్యక్తం చేశారని తెలిపారు.
Read Also: Sai Pallavi: ఆ స్టార్ హీరోని రిజెక్ట్ చేసిన సాయి పల్లవి
Also Read
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
- Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
కూటమి ప్రభుత్వం రైతుల పట్ల అద్భుతంగా పనిచేసినందుకు గర్వపడుతున్నాం అన్నారు మంత్రి మనోహర్.. 6830 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేయటమే కాక 94 శాతం రైతుల ఖాతాల్లో నగదు చెల్లించాం అన్నారు.. గుంటూరు జిల్లాలో గత ప్రభుత్వం కేవలం 4000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వం సుమారు 70 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. పట్టుదలతో రాబోయే ఐదేళ్లలో రైతాంగం అద్భుతంగా ఉంటారని.. వారికి అండగా నిలబడతామన్నారు.. ఇక, పార్టీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు మిత్రులు, వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధితో ముందుకు వెళ్తుందని వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్..
తాజావార్తలు
-
Raaka: ‘బన్నీని ఇలా ఎప్పుడూ చూడలేదు’.. ‘రాకా’ సెట్ చూసి షాకైన మంచు లక్ష్మి
-
Regina Cassandra : హీరోయిన్ నుండి విలన్ పాత్రలకు షిఫ్ట్ అయిన రెజీనా కాసాండ్రా
-
OPPO Find X9s: సగం ధరకే ఒప్పో Find X9s.. 12GB RAM, 50MP కెమెరా, 7025mAh బ్యాటరీతో ప్రీమియం 5G ఫోన్
-
Saransh Jain Debut: ఐపీఎల్ ఆడకుండానే టీమిండియా డెబ్యూ.. మూడో ఆటగాడిగా సారాంశ్ జైన్ అరుదైన రికార్డు!
-
Karthi30: ‘మార్షల్’ కంటే ముందే ‘కార్తి30’ పూర్తి?.. షూటింగ్ షెడ్యూల్పై ఇంట్రెస్టింగ్ అప్డేట్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!