Nadendla Manohar: తెనాలి జనసేన కార్యాలయంలో భోగి మంటలు..
- తెనాలిలోని జనసేన కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు..
- భోగి మంటలను వెలిగించిన మంత్రి నాదెండ్ల మనోహర్..
- భోగి వేడుకల్లో పాల్గొన్న వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar: గుంటూరు జిల్లా తెనాలిలోని జనసేన కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.. జనసేన పార్టీ కార్యాలయంలో భోగి మంటలను వెలిగించారు మంత్రి నాదెండ్ల మనోహర్.. భోగి వేడుకల్లో వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం ఆనందంతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం.. గత నాలుగైదు సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న రైతాంగానికి కూటమి ప్రభుత్వం అండగా నిలబడిందన్నారు.. గత ప్రభుత్వం రైతులకు బకాయి పెట్టిన 1674 కోట్ల బకాయిలను కోటం ప్రభుత్వం రాగానే వారి ఖాతాలో జమ చేశాము.. రైతులు వద్ద ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపే వారి ఖాతాల్లో నగదు జమ చెయ్యటం ద్వారా ముందుగానే సంక్రాంతి వచ్చిందని భావన రైతులు వ్యక్తం చేశారని తెలిపారు.
Read Also: Sai Pallavi: ఆ స్టార్ హీరోని రిజెక్ట్ చేసిన సాయి పల్లవి
Also Read
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
కూటమి ప్రభుత్వం రైతుల పట్ల అద్భుతంగా పనిచేసినందుకు గర్వపడుతున్నాం అన్నారు మంత్రి మనోహర్.. 6830 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేయటమే కాక 94 శాతం రైతుల ఖాతాల్లో నగదు చెల్లించాం అన్నారు.. గుంటూరు జిల్లాలో గత ప్రభుత్వం కేవలం 4000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వం సుమారు 70 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. పట్టుదలతో రాబోయే ఐదేళ్లలో రైతాంగం అద్భుతంగా ఉంటారని.. వారికి అండగా నిలబడతామన్నారు.. ఇక, పార్టీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు మిత్రులు, వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధితో ముందుకు వెళ్తుందని వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్..
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!