Online Cricket Betting: ఏపీలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. ఐదుగురు అరెస్ట్!
- గుంటూరులో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు..
- ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన మంగళగిరి రూరల్ పోలీసులు..
- క్రికెట్ మ్యాచ్ల్లో బెట్టింగ్ పెడితే లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేస్తున్న ముఠా అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Online Cricket Betting: గుంటూరు జిల్లాలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఐదుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి 22 బ్యాంక్ బుక్స్, 11 చెక్కులు, 30 ఏటీఎం కార్డులతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇక, డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ.. చినకాకాని ఎన్ఆర్ఐ హాస్పటల్ వెనుక ఎస్వీఎన్ రెసిడెన్సీ అపార్ట్మెంట్స్లోని ఒక ప్లాట్లో క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతోందని సమాచారం వచ్చింది అన్నారు. దీంతో సోదాలు చేపట్టి కొక్కిలిగడ్డ ఏసన్నను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాం.. బాలు, ప్రవీణ్, సూర్య పారిపోయారు.. ఈ ముగ్గురిపై నిఘా పెట్టి అరెస్టు చేశామన్నారు.
Read Also: CM Chandrababu: రాష్ట్రంలో రహదారులపై సీఎం చంద్రబాబు సమీక్ష.. గుంతలు కనిపించొద్దని ఆదేశాలు..
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
అయితే, ఇందుకూరి బాలకృష్ణ రాజు, ఏసన్న, మనోహర్, ప్రవీణ్, సూర్య ప్రకాశ్లను అరెస్టు చేశామని డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. నిందితుల నుంచి 6 లక్షల 30 వేల రూపాయల నగదుతో పాటు ఐదు ల్యాప్టాప్లు, 32 మొబైల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నాం. ఇక, ప్రధాన నిందితుడు మనోహర్ ఆన్లైన్ గేమింగ్కు అలపడంతో టెలిగ్రామ్ ద్వారా అందిన లింక్ను నమ్మి www.hublibook.com సైట్ ద్వారా అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలను ప్రారంభించినట్లు విచారణలో తేలింది.. తెలియని వ్యక్తుల ఆధార్ కార్డులు, సిమ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలను తెరిపించి మొత్తం 30 అకౌంట్లు ఓపెన్ చేసినట్లు గుర్తించాం.. క్రికెట్ మ్యాచ్ల్లో బెట్టింగ్ పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించి మోసగించేవారు.. డిపాజిట్లు, విత్డ్రాలు, అకౌంట్ బ్యాలెన్స్ లాంటి కార్యకలాపాలకు పాల్పడినందుకు నిందితులను అరెస్ట్ చేశామని డీఎస్పీ మురళీకృష్ణ చెప్పారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!