Chicken and Egg Dishes Free: చికెన్, గుడ్లు ఫ్రీ.. ఫ్రీ.. వంటలు చేసి మరీ పంపిణీ..
- ఉచితంగా చికెన్ పంపిణీ చేసిన పౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులు..
- బర్డ్ ఫ్లూ వదంతులతో పడిపోయిన చికెన్ అమ్మకాలు..
- చికెన్ అమ్మకాలు తిరిగి పుంజుకునేలా చేసేందుకు చర్యలు..
- ఉచితంగా చికెన్, గుడ్ల వంటకాలు పంపిణీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chicken and Egg Dishes Free: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ చికెన్, గుడ్ల అమ్మకాలపై ప్రభావం చూపుతోంది.. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు.. కృష్ణా జిల్లా.. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోని ఫౌల్ట్రీ ఫామ్లలో బర్డ్ఫ్లూ వెలుగు చూసింది.. అలర్ట్ అయిన ప్రభుత్వం.. గోదావరి జిల్లాల్లో బర్డ్ఫ్లూ వెలుగు చూసిన ప్రాంతాన్ని రెడ్జోన్గా కూడా ప్రకటించి.. బర్డ్ఫ్లూ వ్యాప్తిచెందకుండా చర్యలకు దిగింది.. అయితే, ఇదే సమయంలో.. చికెన్, గుడ్లు తినొద్దనే వదంతులు గుప్పుమన్నాయి.. బాగా ఉడికించి తినే చికెన్, గుడ్లతో ఎలాంటి సమస్య ఉండదని వైద్య నిపుణులు, అధికారులు అవగాహన కల్పించే ప్రయత్నం చేసినా.. చికెన్, గుడ్ల అమ్మకాలపై మాత్రం ప్రభావం గట్టిగానే పడింది.. అయితే, ఇప్పుడిప్పుడే మళ్లీ వాటి అమ్మకాలు పుంజుకుంటున్నట్టు చికెన్, గుడ్ల ధరలను చూస్తే తెలిసిపోతోంది.. మరోవైపు.. బర్డ్ఫ్లూ వదంతులు పోగెట్టేందుకు సిద్ధమైన ఫౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులు.. ఉచితంగా చికెన్, గుడ్లు పంపిణీ చేస్తున్నారు..
Read Also: PM Modi: ‘‘భాషా’’ ప్రాతిపదికన సమాజాన్ని విభజించే ప్రయత్నాలకు దూరంగా ఉండండి..
Also Read
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
గుంటూరులో ఉచితంగా చికెన్ పంపిణీ చేశారు పౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులు.. బర్డ్ ఫ్లూ వదంతులతో పడిపోయిన చికెన్ అమ్మకాలను తిరిగి పుంజుకునేలా చేసేందుకు సిద్ధమయ్యారు.. నష్టాల పాలైన నేపథ్యంలో, పౌల్ట్రీ పరిశ్రమకు మద్దతుగా రంగంలోకి దిగి చికెన్ తినాలంటున్న ప్రజా ప్రతినిధులు ప్రచారం చేస్తున్నారు.. ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో భాగంగా.. గుంటూరులోని స్వామి థియేటర్ ప్రాంగణంలో ప్రజలకు ఉచితంగా చికెన్, గుడ్ల వంటకాలను పంపిణీ చేశారు పౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులు.. ఉడికించిన చికెన్, గుడ్లు తినడం వల్ల ఎలాంటి సమస్యలు రావని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, నసీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.. ఇక, చికెన్ వంటకాల కోసం ఆహార ప్రియులు భారీగా తరలివచ్చారు. ఊహించని విధంగా ప్రజలు తరలిరావడంతో నిర్వాహకులు గేట్లకు తాళం వేయాల్సిన పరిస్థితి వచ్చింది.. మరోవైపు, హైదరాబాద్లోని ఉప్పల్లో కూడా ఉచితంగా చికెన్, గుడ్ల వంటకాలు పంపిణీ చేయడంతో ప్రజలు ఎగబడ్డారు..
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!