Harsha Kumar: తురకపాలెం లో ఏదో జరుగుతోంది.. ప్రభుత్వం నిగ్గు తేల్చాలి..
- గుంటూరు జిల్లా తురకపాలెంలో ఏదో జరుగుతోంది..
- ప్రభుత్వం నిగ్గు తేల్చాలని హర్షకుమార్ డిమాండ్..
- తురకపాలెం మెడికల్ క్యాంప్ పరిశీలన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harsha Kumar: గుంటూరు జిల్లా తురకపాలెంలో ఏదో జరుగుతోంది.. ప్రభుత్వం నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ హర్షకుమార్.. తురకపాలెం మెడికల్ క్యాంప్కు వచ్చిన హర్షకుమార్.. బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలు అడిగి తెలుసుకున్న హర్షకుమార్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తురకపాలెం మరణాలకు కారణాలు డాక్టర్లు చెప్పలేక పోతున్నారు.. ఐసీఎంఆర్ టీంలు వచ్చినా కారణాలు తేలలేదు. దళితులు ఉన్న ప్రాంతాలలోనే మరణాలు సంభవించాయి అని ఆరోపించారు… దొంగసారా వల్ల మరణాలు జరిగాయి అని గ్రామస్థులు అంటున్నారు. కొందరు నాయకులు దొంగ సారాకు కారణమయ్యారు. వారెవరో ప్రభుత్వం విచారించాలని కోరారు.. అయితే, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన తర్వాత మరణాలు సంభవించ లేదు.. కానీ, గ్రామంలో ఏదో జరుగుతోది… ప్రభుత్వం నిగ్గు తేల్చాలని కోరారు మాజీ ఎంపీ హర్షకుమార్…
Read Also: Amazon Sale 2025: ఇది కదా డీల్ అంటే.. షావోమీ 14 సీవీపై 17 వేల తగ్గింపు!
Also Read
- SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
- Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
- Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..
- Divyang Shakti Scheme: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. వారికోసం మరింత ఆలోచన చేస్తాం..
కాగా, గుంటూరు తురకపాలెంలో వరుస మరణాలు సంచలనంగా మారాయి.. మరణాల వెనుక ఉన్న మిస్టరీ చేధించేందుకు ఇప్పటికే గ్రామంలో పర్యటించిన పలు జాతీయ సంస్థలు అక్కడి శాంపిల్స్ సేకరించాయి.. నివేదికలు సిద్ధం చేసే పనిలో పడిపోయాయి.. ఎయిమ్స్, ఐసీఏఆర్, NCDC, NHC బృందాలు గ్రామంలో పర్యటించాయి. కేవలం 4 నెలల వ్యవధిలో 40 మంది గ్రామస్తులు మృతిచెందడం ఇప్పుడు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.. జులైలో 10, ఆగస్టులో 10, సెప్టెంబర్ ప్రారంభంలో 3 మరణాలు.. ఇలా ఇప్పటికే 40 మంది మృతిచెందారు.. జ్వరం, దగ్గు, ఆయాసంతో ఆస్పత్రుల్లో చేరడం.. అక్కడే ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి.. ముఖ్యంగా ఎస్సీ కాలనీలోనే ఎక్కువగా మరణాలు నమోదు కావడంతో దీనిపై మూఢనమ్మకాలు కూడా ప్రచారంలోకి వచ్చాయి..
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..