Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu Hunger Strike: గుంటూరులో తన ఇల్లు, కార్యాలయంపై జరిగిన దాడి ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబబు నిరాహార దీక్ష చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ఉదయం ఆరు గంటలకు నిరాహార దీక్ష ప్రారంభించిన ఆయన.. సాయంత్రం ఆరు గంటల వరకు దీక్ష కొనసాగుతుంది ప్రకటించారు.. ఇక, అంబటి రాంబాబు దీక్షకు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, వైసీపీ నేతలు నూరి ఫాతిమా, డైమండ్ బాబు, వేమారెడ్డి తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఇల్లు, ఆఫీసుపై అత్యంత దారుణంగా దాడి జరిగిందన్నారు. కార్లు, ఫర్నీచర్ ధ్వంసం చేశారని, అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగిందని పేర్కొన్నారు.
Read Also: Modi Cabinet: ఉ.11:30కి మోడీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
Also Read
- SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
- Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..
- Divyang Shakti Scheme: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. వారికోసం మరింత ఆలోచన చేస్తాం..
- Vegetable Market: మరోసారి తెరపైకి కూరగాయల హోల్ సేల్ మార్కెట్ వివాదం
తాను చంద్రబాబు నాయుడును దూషించాననే ఆరోపణలతో అరెస్టు చేసి 18 రోజులు జైలులో ఉంచారని, అయితే తన ఇంటిపై దాడి చేసిన వారిని కనీసం 18 నిమిషాలైనా జైలుకు పంపించారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అంబటి రాంబాబు.. తనను అరెస్టు చేసిన అనంతరం నల్లపాడు పోలీస్ స్టేషన్లో హింసించేందుకు ప్రయత్నించారని, కస్టోడియల్ టార్చర్పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు. ఈ దాడి వెనుక నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టబోనని, వారిని జైలుకు పంపించే వరకు తన పోరాటం ఆగదన్నారు. గుంటూరులో ఇళ్లపై దాడులు చేసే సంస్కృతిని పెమ్మసాని చంద్రశేఖర్ తీసుకొచ్చారని విమర్శించారు. ఇద్దరు సీఐలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
తనను భయపెట్టాలనుకుంటే అది వారి పొరపాటేనని, చట్టబద్ధంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని కోరారు అంబటి.. ప్రాణాలకు తెగించైనా చట్టపరంగా మీ సంగతి తేలుస్తానని హెచ్చరించారు. దాడి ఘటనపై న్యాయపోరాటం, ప్రజాపోరాటం రెండూ చేస్తానని, తాను చేస్తున్నది ధర్మపోరాటమని తెలిపారు. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దుర్మార్గమైన పాలనకు మద్దతు ఇస్తున్నారని కూడా విమర్శించారు మాజీ మంత్రి, వైసీపీ అధినేత అంబటి రాంబాబు..
తాజావార్తలు
-
Iran Nuclear Warning: అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. ‘మాపై చేయి వేస్తే.. అణు విలయమే!’
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు.. సీఎం విజయ్ వైఖరిపై మిత్రపక్షాల్లో ఆగ్రహం..
-
AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
-
Israel-Hezbollah: హిజ్బుల్లా అండర్గ్రౌండ్ను గుర్తించిన ఐడీఎఫ్.. వీడియో విడుదల
-
India message to China: పాకిస్తాన్కు చైనా మద్దతు.. భారత్ గట్టి సందేశం..
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!