Andhra Pradesh: గ్రూప్-1 ఫలితాలపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్
విజయవాడ రాజ్భవన్లో గ్రూప్-1 అభ్యర్థులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ అధికారుల వల్ల తాము భవిష్యత్ కోల్పోతున్నామని గవర్నర్ వద్ద గ్రూప్-1 అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ అధికారులు మారితే ఫలితాలు ఎలా మారతాయని అభ్యర్థులు ప్రశ్నించారు. జవాబు పత్రాలు మార్చడం వెనుక కారణమేంటని.. అధికారులు మారాక ఆచరణ, నిర్వహణ తీరు మారిపోయిందని ఆరోపించారు. గతంలో 326 మందిని ఇంటర్వ్యూకి పిలిచారని.. ఇప్పుడు 202 మందిని ఆ జాబితా నుంచి తొలగించారని.. గతంలో సిద్ధం చేసిన ఫలితాలు ఎక్కడ ఉన్నాయని ఓ గ్రూప్-1 అభ్యర్థి గవర్నర్ దగ్గర ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
55 వేల సమాధాన పత్రాలను 35 రోజుల్లో ఎలా దిద్దారో చెప్పాలని గ్రూప్-1 అభ్యర్థులు ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. హడావుడి ఇంటర్వ్యూల వెనుక లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఈ ఫలితాలు నిలిపివేసి అక్రమాలు జరగలేదని నిరూపించాలని డిమాండ్ చేశారు. కోర్టు సెలవుల సమయంలో ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగారు. డిజిటల్ వాల్యూయేషన్ అంతా పారదర్శకంగానే జరిగిందని చెప్పారని.. కానీ ఇప్పుడు అభ్యర్థులనే మార్చి తమకు అన్యాయం చేశారని మండిపడ్డారు. అర్హత లేనివారిని అడ్డదారుల్లో ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై సీబీఐతో విచారణ చేయించి 202 మందికి న్యాయం చేయాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశామని గ్రూప్-1 అభ్యర్థులు తెలిపారు. పూర్తిగా విచారణ చేసి న్యాయం చేస్తామని గవర్నర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- AP SSC Results 2026: టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..
- AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
Chandrababu : ఆ నిబంధన రాష్ట్ర దుస్థితికి.. అసమర్థ పాలనకు నిదర్శనం
కాగా గ్రూప్-1 అభ్యర్థులు గవర్నర్ను కలవడానికి వచ్చిన సమయంలోనే రాజ్ భవన్కు ఏపీపీఎస్సీ అధికారి గౌతమ్ సవాంగ్ వచ్చారు. ఆయన యాన్యువల్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి గవర్నర్ను కలిసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గ్రూప్-1 ఫలితాల విషయంలో తాజా పరిణామాలను కూడా ప్రస్తావించినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Tollywood : బీస్ట్ మోడ్లోకి స్టార్ బ్యూటీస్.. రియల్ స్టంట్స్ చేస్తోన్న హీరోయిన్స్
-
Iran War: ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..
-
Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
-
IPL 2026: “ఇక 350 కొడితేనే సేఫ్”.. ఐపీఎల్ పరుగుల ప్రవాహంపై ఆ దేశ క్రికెట్ బోర్డు ఆసక్తికర పోస్ట్..
-
Bengal Exit Poll: అంతుచిక్కని బెంగాల్ ఓటర్ నాడి.. ఎగ్జిట్ పోల్స్పై ప్రముఖ సంస్థ మౌనం..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!