ఏపీలో సంచలనం సృష్టించిన సినిమా టికెట్ల ధరలపై ఇంకా ఎలాంటి స్పష్టత నెలకొనలేదు. అయితే ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలపై జీవో 35ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో పై హై కోర్టును పలువురు నిర్మాతలు, ఎగ్జిబ్యూటర్ ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హై కోర్ట్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జీవో ను రద్దు చేసింది. దీంతో హై కోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సింగిల్ డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. దీంతో హై కోర్టులో సినిమా టికెట్ల ధరలపై విచారణ జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం సినీ ప్రముఖుల విజ్ఞప్తి మేరకు సినిమా టికెట్ రేట్ల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సచివాలయంలో కాసేపట్లో సినిమా టికెట్ రేట్ల ప్రభుత్వ కమిటీ సమావేశం కానుంది. సభ్యుల సూచనలపై ఇవాళ మరోసారి కమిటీ చర్చించనుంది. కమిటీ నివేదిక ఆధారంగా టికెట్ రేట్ల సవరణ చేసే అవకాశం ఉంది. గత నెలలో ఒకసారి సమావేశమైన కమిటీ.. బీ, సీ సెంటర్లలో టికెట్ రేట్లు పెంచాలని గత సమావేశంలో ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ సభ్యులు కోరారు.