Gouthu Sirisha : మహానాడు తర్వాత టీడీపీపై వేధింపులు పెరిగాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ మహిళా నేత గౌతు శిరీషకు ఇచ్చిన నోటీసుల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మొదట ఇచ్చిన నోటీసులో మంగళగిరి సీఐడీ రాష్ట్ర కార్యాలయంలో విచారణకు రావాలని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ నేపథ్యంలో.. టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి మంగళగిరి సీఐడీ కార్యాలయానికి బయలుదేరిన శిరీషకు మళ్ళీ సీఐడీ అధికారుల ఫోన్ చేసి.. మంగళగిరి కార్యాలయానికి కాకుండా గుంటూరు కార్యాలయం రండి అని సీఐడీ అధికారులు కోరారు. అయితే.. గౌతు శిరీషతో పాటు సీఐడీ కార్యాలయానికి అనుచరులు చేరుకున్నారు. ఈ క్రమంలో మంగళగిరి సీఐడీ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
దీంతో.. గుంటూరు సీఐడీ కార్యాలయానికి వెళ్ళాలని శిరీషకి పోలీసులు సూచించారు. అయితే.. తనకిచ్చిన నోటీసుల్లో మంగళగిరి సీఐడీ కార్యాలయమనే ఉంది కాబట్టి.. తానిక్కడే విచారణకు హాజరవుతానన్న శిరీష స్పష్టం చేశారు. చేసేదేం లేక శిరీషతో పాటు ఆమె తరుపు న్యాయవాదిని మాత్రమే పోలీసులు కార్యాలయంలోకి అనుమతించారు. ఈ సందర్భంగా గౌతు శిరీష మాట్లాడుతూ.. సోషల్ మీడియా పోస్టింగుల పేరుతో ప్రభుత్వం వేధిస్తోందని, మహనాడు తర్వాత టీడీపీపై మరిన్ని వేధింపులు పెరిగాయని ఆమె ఆరోపించాఉ. ఫేక్ పోస్టింగులతో టీడీపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మేం ఫిర్యాదులిచ్చినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు.
Also Read
- Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
- CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
- Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
-
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?