Gas Cylinder : వినియోగదారులకు అలర్ట్.. గ్యాస్ కొరతపై ప్రభుత్వం స్పష్టత
- యుద్ధ పరిస్థితుల మధ్య గ్యాస్ సరఫరాపై ప్రభుత్వ స్పష్టత
- తప్పుడు ప్రచారాలతో పెరిగిన పానిక్ బుకింగ్స్
- డొమెస్టిక్ వినియోగదారులకు ప్రాధాన్యత.. కమర్షియల్ సిలిండర్లపై పరిమితి
- పెట్రోల్, డీజిల్ కొరత వార్తలను ఖండించిన చమురు సంస్థలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో వంట గ్యాస్ ధరలు పెరుగుతాయని లేదా సరఫరా నిలిచిపోతుందనే వార్తలపై ప్రభుత్వం , అధికారులు కీలక స్పష్టతనిచ్చారు. ఈ యుద్ధ ప్రభావం దేశంలో వంట గ్యాస్ సరఫరాపై ఏమాత్రం ఉండదని, రాష్ట్రవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరా సజావుగానే కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. అయితే, యుద్ధం కారణంగా గ్యాస్ దొరకడం కష్టమవుతుందనే తప్పుడు ప్రచారాల వల్ల ఆంధ్రప్రదేశ్లో సుమారు 30 శాతం వరకు అదనంగా పానిక్ బుకింగ్స్ నమోదవుతున్నాయని, అయినప్పటికీ పెరిగిన డిమాండ్కు అనుగుణంగా సరఫరాను కొనసాగిస్తున్నామని వారు తెలిపారు. ప్రస్తుతం అదనపు స్టాక్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, సిలిండర్ డెలివరీలు ఎక్కడా ఆటంకం లేకుండా స్మూత్ గా జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
Jasprit Bumrah Bowling: పిసినారి ‘బుమ్రా’.. భారత్ ఫైనల్ చేరడానికి కారణం ఆ మూడు ఓవర్లే!
Also Read
- Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్లు..! ప్రత్యేక మెకానిజం
- Leopard: అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం.. పరుగులు తీసిన భక్తులు
- OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
- Job Fraud: నిరుద్యోగులు కదా ప్రభుత్వ ఉద్యోగం అంటే నమ్మేశారు.. ఒకొక్కరి నుంచి రూ.15 లక్షల చొప్పున వసూలు చేసి..
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొన్ని నిబంధనలను అమలు చేస్తోంది. సాధారణంగా గ్యాస్ బుకింగ్ కోసం ఉండే 21 రోజుల స్టాండర్డ్ క్యాప్ను ప్రస్తుతం ఖచ్చితంగా అమలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోటి 50 లక్షల డొమెస్టిక్ కనెక్షన్లకు, అందులోనూ ముఖ్యంగా ఉజ్వల యోజన కింద ఉన్న 50 లక్షల కనెక్షన్లకు నిరంతరాయంగా సరఫరా అందుతోంది. అయితే, గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో కొత్త కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేసి, కేవలం అత్యవసర అవసరాలకు మాత్రమే అనుమతిస్తున్నారు.
మరోవైపు, సోషల్ మీడియాలో వస్తున్న పెట్రోల్ , డీజిల్ కొరత వార్తలను కూడా ప్రభుత్వం , చమురు సంస్థలు తీవ్రంగా ఖండించాయి. HPCL, BPCL, , IOCL వంటి సంస్థలు దేశంలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
8.12 అంగుళాల డిస్ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్సెట్ తో వచ్చేస్తున్న OPPO Find N6..!
తాజావార్తలు
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
Roshan Kanakala: ప్రేమ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్.. రోషన్ కనకాల కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
-
India vs England: చేజారిన టీ20 సిరీస్.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీ.. ఇక ఇంగ్లండ్పై ప్రతీకారమే మిగిలింది..!
-
Srileela Trolling : శ్రీలీలకు అవమానం.. లెనిన్ నుండి తప్పుకోవడం ప్లస్ అంటూ ట్రోలింగ్
-
ASUS Vivobook 14: ఆసుస్ వివో బుక్ 14, 15 భారత్లో లాంచ్.. Intel AI ప్రాసెసర్, 17 TOPS NPU, DDR5 RAM
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!