Andhra Pradesh: ఏపీ సర్కారు శుభవార్త.. ఆగస్టు 1 నుంచి ఆరోగ్యశ్రీలో చికిత్సల జాబితా పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుధవారం నాడు వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందించే చికిత్సల జాబితాను పెంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 1 నుంచి పెంచిన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెంచనున్న చికిత్సల జాబితాను త్వరలోనే ఖరారు చేస్తామని తెలిపారు. అటు ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. విలేజ్ క్లినిక్స్కు, పీహెచ్సీలకు డిజిటల్ వీడియో అనుసంధానత ఉండాలని సీఎం సూచించారు. ఇప్పటికే ఆరోగ్య శ్రీ ద్వారా 2446 చికిత్సలకు ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందిస్తోంది. ఆరోగ్యశ్రీ కింద డబ్బు నేరుగా రోగి వర్చువల్ బ్యాంకు ఖాతాలోకి జమ చేసి అక్కడ నుంచి ఆస్పత్రికి చెల్లిస్తోంది. ఆస్పత్రిలో చేరిన రోగి నుంచి ముందుగా కన్సెంట్ ఫాం, చికిత్స పూర్తయిన తర్వాత ధృవీకరణ పత్రం జారీ చేస్తోంది.
Read Also: Viral Tiktok: వీడు మాములోడు కాదు… పోలీస్ వెహికల్ లోనే..
Also Read
మరోవైపు దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపైనా సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. ఈ మేరకు రాష్ట్రంలో కరోనా పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అధికారులు వెల్లడించారు. అక్కడక్కడా కోవిడ్ కేసులు ఉన్నా.. ఆస్పత్రిలో చేరుతున్నవారి సంఖ్య అతి స్వల్పంగా ఉందని అధికారులు తెలిపారు. కేవలం 69 మంది మాత్రమే ఆస్పత్రుల్లో ఉన్నారని.. వీరందరూ కూడా కోలుకుంటున్నారని స్పష్టం చేశారు. ఇప్పటికే 87.15శాతం మందికి ప్రికాషన్ డోసు వేశామని అధికారులు సీఎంకు వివరించారు. ప్రికాషన్ డోసు వ్యవధిని తగ్గించినందున వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీఎం జగన్ తెలిపారు. ముఖ్యంగా 60ఏళ్ల పైబడ్డ వారికి ప్రికాషన్ డోసు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. 15 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్నవారికి రెండోడోసు 99.69శాతం మందికి ఇచ్చామని అధికారులు తెలిపారు. 12 – 14 ఏళ్ల మధ్యనున్న వారికి 98.93 శాతం రెండో డోసు పూర్తిచేశామని అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..