Andhra Pradesh: ఏపీ సర్కారు శుభవార్త.. ఆగస్టు 1 నుంచి ఆరోగ్యశ్రీలో చికిత్సల జాబితా పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుధవారం నాడు వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందించే చికిత్సల జాబితాను పెంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 1 నుంచి పెంచిన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెంచనున్న చికిత్సల జాబితాను త్వరలోనే ఖరారు చేస్తామని తెలిపారు. అటు ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. విలేజ్ క్లినిక్స్కు, పీహెచ్సీలకు డిజిటల్ వీడియో అనుసంధానత ఉండాలని సీఎం సూచించారు. ఇప్పటికే ఆరోగ్య శ్రీ ద్వారా 2446 చికిత్సలకు ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందిస్తోంది. ఆరోగ్యశ్రీ కింద డబ్బు నేరుగా రోగి వర్చువల్ బ్యాంకు ఖాతాలోకి జమ చేసి అక్కడ నుంచి ఆస్పత్రికి చెల్లిస్తోంది. ఆస్పత్రిలో చేరిన రోగి నుంచి ముందుగా కన్సెంట్ ఫాం, చికిత్స పూర్తయిన తర్వాత ధృవీకరణ పత్రం జారీ చేస్తోంది.
Read Also: Viral Tiktok: వీడు మాములోడు కాదు… పోలీస్ వెహికల్ లోనే..
Also Read
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
మరోవైపు దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపైనా సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. ఈ మేరకు రాష్ట్రంలో కరోనా పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అధికారులు వెల్లడించారు. అక్కడక్కడా కోవిడ్ కేసులు ఉన్నా.. ఆస్పత్రిలో చేరుతున్నవారి సంఖ్య అతి స్వల్పంగా ఉందని అధికారులు తెలిపారు. కేవలం 69 మంది మాత్రమే ఆస్పత్రుల్లో ఉన్నారని.. వీరందరూ కూడా కోలుకుంటున్నారని స్పష్టం చేశారు. ఇప్పటికే 87.15శాతం మందికి ప్రికాషన్ డోసు వేశామని అధికారులు సీఎంకు వివరించారు. ప్రికాషన్ డోసు వ్యవధిని తగ్గించినందున వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీఎం జగన్ తెలిపారు. ముఖ్యంగా 60ఏళ్ల పైబడ్డ వారికి ప్రికాషన్ డోసు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. 15 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్నవారికి రెండోడోసు 99.69శాతం మందికి ఇచ్చామని అధికారులు తెలిపారు. 12 – 14 ఏళ్ల మధ్యనున్న వారికి 98.93 శాతం రెండో డోసు పూర్తిచేశామని అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?