Food Poison: కుప్పం యూనివర్సిటీ హాస్టల్లో 30మందికి అస్వస్థత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లా కుప్పం యూనివర్సిటీ లోని మహిళా హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్నం మహిళా హాస్టల్లో భోజనం తిన్న 30 మంది పీజీ మహిళా విద్యార్ధినులకు ఫుడ్ పాయిజన్ కావడంతో వారు అస్వస్థతకు గురయ్యారు. దీనికి పూర్తి బాధ్యత వార్డెన్ అని అంటున్నారు. సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు నిర్ధారించారు.
కొంతమంది పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స అందిస్తున్నారు. అయితే ఏ సమాచారం గాని బయటకు రానివ్వకుండా దాచిపెడుతున్నా కుప్పం ద్రవిడియన్ యూనివర్సిటీ యాజమాన్యం. కుప్పం ద్రావిడ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కి గురైన విద్యార్ధినుల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ఆహారంలో నాణ్యత లోపం వల్ల అలా జరిగిందా? సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనేది విచారించాల్సి వుంది. దీనిపై స్పందించేందుకు అధికారులు ఎవరూ అందుబాటులో లేరు.
Also Read
- CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
- Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
- RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్
మరోవైపు కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు. 25 మందికి పైగా విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారని చంద్రబాబుకు వివరించారు టీడీపీ స్థానిక నేతలు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యూనివర్సిటీ విద్యార్ధినుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని స్థానిక నేతలకు చంద్రబాబు సూచించారు.
మంత్రి సురేష్ ఆదేశాలు
చిత్తూరు జిల్లా కుప్పం ద్రావిడ యూనివర్సిటీ లో విద్యార్థినుల అస్వస్థత పై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరాతీశారు. అస్వస్థతకు కారణాలు ఏమిటో గుర్తించాలని, మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి.సంఘటనపై నివేదిక అందజేయాలని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ను ఆదేశించారు మంత్రి సురేష్. విద్యార్థినుల అస్వస్థత సంఘటన పై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డిని ఆదేశాలు జారీచేశారు మంత్రి సురేష్.
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
PM Modi: బెంగాల్ ఉత్సాహం తెలంగాణలో కూడా కనిపిస్తోంది..
-
Money Heist: ‘మనీ హెయిస్ట్’ ఫ్యాన్స్కు నెట్ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!
-
Warren Buffett: ‘అమ్మా.. నీ కోపమే నన్ను ప్రపంచ విజేతను చేసింది’.. వారెన్ బఫెట్
-
S Keerthana: 29 ఏళ్లకే మంత్రి.. 5 భాషల్లో ప్రావీణ్యం.. విజయ్ కేబినెట్లో స్పెషల్గా కీర్తన..
-
LSG vs CSK : లక్నో భారీ స్కోరు.. ఇంగ్లిస్ శివతాండవం.. షాబాజ్ మెరుపు ముగింపు.!