తిరుమల ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో టీటీడీ విడుదల చేసింది. ప్రతిరోజూ 12వేల టిక్కెట్లు చొప్పున రూ.300 దర్శనం టిక్కెట్లను టీటీడీ అందుబాటులో ఉంచగా.. అన్నీ టిక్కెట్లు 40 నిమిషాల వ్యవధిలోనే బుక్ అయిపోయాయి. చాలా మంది భక్తులకు టిక్కెట్లు దొరక్కపోవడంతో వారు నిరాశకు గురయ్యారు.
Read Also: అదొక్కటే జగన్ చేసిన మంచి పని: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల
కాగా మరోవైపు ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి సర్వదర్శనం టిక్కెట్లను శనివారం నాడు టీటీడీ విడుదల చేయనుంది. రోజుకు 10వేల టిక్కెట్ల చొప్పున సర్వదర్శనం టిక్కెట్లను టీటీడీ ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనం టిక్కెట్లను టీటీడీ పరిమిత సంఖ్యలో విడుదల చేస్తోంది. వ్యాక్సిన్ సర్టిఫికెట్లు ఉంటేనే దర్శనానికి అనుమతిస్తామని ఇప్పటికే టీటీడీ పలుమార్లు స్పష్టం చేసింది.