Washing Machine: వాషింగ్ మిషన్ వివాదం.. వివాహితను ఇనుప రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి, కొడుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Washing Machine: వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ముగ్గరు పిలల్లలు వున్నారు. కలతలు లేకుండా వారి జీవితం అన్యోన్యంగా సాగుతున్న జీవితంలో వాషింగ్ మిషన్ వివాదం ఆమె ప్రాణాలు బలితీసుకుంది. వాషింగ్ మిషన్ వివాదంతో ఒకరినొకరు వాదోపవాదాలు చేసుకున్నారు. చివరకు అది ఆమెపై దాడి చేసేవరకు వెళ్లడంతో ఆమె ప్రాణాలు విడిచింది. ఈ విషధ ఘటన సత్యసాయి జిల్లా కదిరి లో చోటుచేసుకుంది.
Read also: Directors: హిట్ దర్శకుల నెక్స్ట్ సినిమాలు ఏంటి?
Also Read
- Pawan Kalyan : ఏపీలో రక్షణ రంగ విప్లవం.. మెగా ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం.!
- Illegal Ration Rice: అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం.. 2 వేల కేజీల బియ్యం స్వాధీనం!
- Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని మాషానంపేట కాలనీలో దంపతులు పద్మావతి బాయి, మనోజ్ కుమార్ నివసిస్తున్నారు. పద్మావతీబాయి రోజూలాగానే ఇంట్లోని వాషింగ్ మిషన్ తో తల బట్టలు ఉతకడానికి వేసింది. అయితే అదే తన ప్రాణానికి దారి తీస్తుందని ఊహించేకోలేదు ఆమె. వాషింగ్ మిషన్ లో బట్టలు వేడయం అయిపోయింది. అయితే అందులోనుంచి వచ్చే బట్టల మురికి నీరు వాషింగ్ మిషన్ నుంచి బయటకు పంపే వ్యవహారంలో పక్కింటి వారికి పద్మావతి కి గొడవ ప్రారంభమైంది. వాషింగ్ మిషన్ నుంచి వచ్చే వ్యర్థ నీరు పక్కనే ఉన్న వేమన్న నాయక్ ఇంటికి వెళ్లింది. బయటకు వచ్చిన వేమన్న నాయక్ పద్మావతి తో గొడవ పడ్డాడు. మురికి నీరు ఇంటి ముందుకు వస్తున్నాయి ఇలా రాకుండా చూడాలని వాదించాడు. దీంతో పద్మావతి ససేమిరా అంది. వేమన్న నాయక్, అతని కుమారుడు రంగంలోకి దిగడంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది.ఈ క్రమంలో వేమన్న నాయక్, అతని కుమారుడు ప్రకాష్ నాయక్ పద్మావతిపై ఇనుప రాడ్, రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆమె ముఖం, తలపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు పద్మావతిని కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Peddi: దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని పెద్ది కథ రాశా.. ‘పెద్ది’ సీక్రెట్స్ చెప్పిన బుచ్చిబాబు!
-
Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
-
Gold Demand : దక్షిణ భారతీయుల బంగారం సెంటిమెంట్ను మారుతుందా..?
-
Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..
-
West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!