Facial attendance: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్.. ఏపీ సర్కార్లో ఫేస్ రికగ్నిషన్ యాప్
- గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్..
- ఏపీ సర్కార్లో ఫేస్ రికగ్నిషన్ యాప్ తెచ్చిన సర్కార్..
- సమయాలను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Facial attendance: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పని తీరును మరింత పర్యవేక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల అటెండెన్స్ కోసం ఫేస్ రికగ్నిషన్ ఆధారిత మొబైల్ యాప్ను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఇకపై ఈ యాప్ ద్వారా హాజరు నమోదు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కార్యాలయ సమయాలను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆలస్యం, గైర్హాజరు లాంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
Read Also: Astrology: జనవరి 17, శనివారం దినఫలాలు..
Also Read
- Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
- Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
- Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
- Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
ఇక, ప్రస్తుతం రీ-సర్వే కార్యక్రమాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు మాత్రం ఈ అటెండెన్స్ యాప్ నుంచి తాత్కాలిక మినహాయింపు ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఫీల్డ్లో పని చేస్తున్న వారి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా, ఇటీవల కొంతమంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆఫీసుల్లో అందుబాటులో ఉండటం లేదన్న ఫిర్యాదులు అధికారుల దృష్టికి వచ్చాయి. ప్రజలకు సక్రమంగా సేవలు అందడం లేదని, కార్యాలయాల్లో ఉద్యోగులు కనిపించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి అని సర్కార్ సీరియస్గా తీసుకుంది.
Read Also: Off The Record: పశ్చిమ గోదావరిలో వైసీపీకి షాక్..!
కాగా, ప్రజలకు నేరుగా సేవలు అందించే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉద్యోగుల పని తీరును మెరుగుపరచడం, జవాబుదారీతనం పెంచడం లక్ష్యంగా ఈ ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ యాప్ను తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక, ఈ కొత్త విధానం అమలుతో గ్రామ, వార్డు సచివాలయాల్లో సేవలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అందనున్నాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
-
Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
-
1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
-
Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్లో మంటలు..
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!