Facial attendance: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్.. ఏపీ సర్కార్లో ఫేస్ రికగ్నిషన్ యాప్
- గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్..
- ఏపీ సర్కార్లో ఫేస్ రికగ్నిషన్ యాప్ తెచ్చిన సర్కార్..
- సమయాలను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Facial attendance: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పని తీరును మరింత పర్యవేక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల అటెండెన్స్ కోసం ఫేస్ రికగ్నిషన్ ఆధారిత మొబైల్ యాప్ను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఇకపై ఈ యాప్ ద్వారా హాజరు నమోదు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కార్యాలయ సమయాలను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆలస్యం, గైర్హాజరు లాంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
Read Also: Astrology: జనవరి 17, శనివారం దినఫలాలు..
Also Read
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
ఇక, ప్రస్తుతం రీ-సర్వే కార్యక్రమాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు మాత్రం ఈ అటెండెన్స్ యాప్ నుంచి తాత్కాలిక మినహాయింపు ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఫీల్డ్లో పని చేస్తున్న వారి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా, ఇటీవల కొంతమంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆఫీసుల్లో అందుబాటులో ఉండటం లేదన్న ఫిర్యాదులు అధికారుల దృష్టికి వచ్చాయి. ప్రజలకు సక్రమంగా సేవలు అందడం లేదని, కార్యాలయాల్లో ఉద్యోగులు కనిపించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి అని సర్కార్ సీరియస్గా తీసుకుంది.
Read Also: Off The Record: పశ్చిమ గోదావరిలో వైసీపీకి షాక్..!
కాగా, ప్రజలకు నేరుగా సేవలు అందించే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉద్యోగుల పని తీరును మెరుగుపరచడం, జవాబుదారీతనం పెంచడం లక్ష్యంగా ఈ ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ యాప్ను తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక, ఈ కొత్త విధానం అమలుతో గ్రామ, వార్డు సచివాలయాల్లో సేవలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అందనున్నాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Ram Charan: ‘చిట్టిబాబు’ వర్సెస్ ‘పెద్దిగాడు’: రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ ఏది?
-
IndiGo Flights Suspended: విదేశీ ప్రయాణికులకు అలర్ట్.. కీలక రూట్లలో ఇండిగో సర్వీసులు రద్దు
-
Hema : షూటింగ్లకే మూడ్ ఉండదు.. పవన్ కళ్యాణ్ను విమర్శిస్తారా?
-
Religious Conversion: ‘‘ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి’’.. TCS తర్వాత విప్రోపై ఆరోపణలు..
-
Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!