AP Skill Development Scam: AP స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ స్కాం… ఈడీ ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లో చోటుచేసుకున్న కుంభకోణం కలకలం రేపుతోంది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లో భారీగా కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి జర్మనీకి చెందిన సీమెన్స్ సంస్థకు వృత్తి నైపుణ్యంపై శిక్షణ ఇచ్చే విషయమై ఒక ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు విలువ 3 వేల 350 కోట్ల రూపాయలు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తో సీమెన్స్ సంస్థ ఈ 3 వేల 350 కోట్ల ప్రాజెక్టు ఒప్పందం కుదుర్చుకుంది.
Read Also: YSRCP: బావ, బావమరిది మధ్యలో మామ.. వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో ఆస్తి గొడవలు
Also Read
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్..
- CM Chandrababu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
అందులో 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటా 370 కోట్ల రూపాయలు. ఈ ప్రభుత్వ వాటాలోని 370 కోట్లలో సుమారు 241 కోట్ల 78 లక్షల 61 వేల 508 రూపాయలు దారిమళ్ళించారు. స్కిల్ డెవలప్ మెంట్ లో నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ లో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఏపీ ప్రభుత్వం నుండి 370 కోట్లు బిల్లులు తీసుకున్న సిమెన్ సంస్థ జీఎస్టీనీ కూడా ఎగ్గొట్టడంతో బయటికి పొక్కింది విషయం. ఫేక్ ఇన్ వాయిస్ లతో ఎగనామం పెట్టడాన్ని జీఎస్టీ అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ జరిపారు. సీఐడీ కేసును తన పరిధిలోకి తీసుకున్న ఈడీ కూపీ లాగుతోంది. ఏపీలో స్మిల్ డెవలప్మెంట్ స్కాం పై ఈడీ ఫోకస్ పెట్టడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది.
ఈవ్యవహారానానికి సంబంధించి మాజీ ఛైర్మన్ గంటా సుబ్బారావు, మాజీ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ, ఓఎస్డీ నిమ్మగడ్డ ప్రసాద్కు ఈడీ నోటీసులు జారీచేసింది. రేపటి నుంచి హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది ఈడీ. స్కాం లో నిందితులుగా ఉన్న వారిలో 26 మందికి నోటీసులు జారీ అయ్యాయి. 234 కోట్ల నిధులు మళ్లించినట్లు గుర్తించారు విచారణ అధికారులు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాంపై ఈడీ ఫోకస్ పెట్టడంతో ఇందులో ఎవరి ప్రమేయం ఉందో బయటకు రానుంది.

Enforcement Directorate
ఈస్కాంలో నిందితులుగా ఉన్నవారందరికీ ఈడీ నోటీసులు జారీచేయడంతో డొంకంత కదులుతుందని భావిస్తున్నారు. పలు షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు జరిగిందని తెలుస్తోంది. మాజీ చైర్మన్ గంటా సుబ్బారావు, మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణకు నోటీసులు అందాయి. ఓఎస్డీ నిమ్మగడ్డ కృష్ణప్రసాద్కు నోటీసులు జారీ అయ్యాయి. రేపు హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసులు జారీకావడంతో ఈవ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని భావిస్తున్నారు.
ఇన్వెబ్ సర్వీస్ నుంచి సీమెన్స్తో పాటు డిజైన్ టెక్ కంపెనీకి నిధుల మళ్లింపు జరిగింది. కార్పొరేషన్ మాజీ ఎండీ గంటా సుబ్బారావుకు చెందిన ప్రతీక్ ఇన్ఫో సర్వీసెస్కు రూ. కోట్ల మళ్లింపు జరిగినట్టుగా భావిస్తున్నారు. రూ. 370 కోట్లలో సుమారు 241 కోట్ల 78 లక్షల 61 వేల 508 రూపాయలు దారిమళ్లాయి. స్కిల్ డెవలప్ మెంట్ లో నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ లో నిర్ధారణ అయింది. మొత్తం మీద ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈడీ దర్యాప్తులో కొత్త కోణం
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఈడీ దర్యాప్తులో కొత్త కోణం బయటపడింది. ఇప్పటికే సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థల ప్రతినిధుల విచారణ చేపట్టింది ఈడీ. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలో భాగంగా నాటి ప్రభుత్వం సీమెన్స్ సంస్థతో రూ. 3350 కోట్లతో ఒప్పందం చేసుకుంది. సీమెన్స్ సంస్థ 90 శాతం విడుదల చేశాకే.. రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులను విడుదల చేయాలనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. 90 శాతం నిధులు సీమెన్స్ నిధులను విడుదల చేసిందా..? లేదా..? ఒకవేళ సీమెన్స్ సంస్థ 90 శాతం నిధులు విడుదల చేస్తే ఆ నిధులమేయ్యాయనే కోణంలో ఈడీ దర్యాప్తు నిర్వహిస్తోంది. సీమెన్స్ నిధులు విడుదల చేయకుండానే ఏపీ ప్రభుత్వం తన వాటాను విడుదల చేసిందా అనే అంశంలోనూ కూపీ లాగుతోంది ఈడీ.
Read Also: Bandi Sanjay: దొంగ దందా చేస్తే మోడీ ప్రభుత్వం వీపంతా సాఫ్ చేస్తది
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!