Graduates, Teacher Mlc Voters: పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ షురూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో పట్టభద్రులు- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది ఎన్నికల సంఘం. 2023 మార్చి 29 తేదీన ఐదుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగుస్తుండటంతో ఓటర్ల నమోదు ప్రక్రియ షెడ్యూల్ ప్రకటన విడుదలైంది. 2022 అక్టోబరు 1 తేదీ నుంచి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు బహిరంగ ప్రకటన జారీ చేయాలని ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు జారీ అయ్యాయి. 2022 నవంబరు 7 తేదీ నుంచి ఫాం 18 ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని సూచనలు అందాయి.
Read Also: Kireeti Reddy: ‘జూనియర్’గా జనం ముందుకు గాలి జనార్దన్ రెడ్డి తనయుడు!
Also Read
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
- CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
2022 నవంబరు 23 తేదీ నాటికి ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించాలని స్పష్టం చేసింది. 2022 డిసెంబర్ 30 తేదీనాటికి ఓటర్ల తుది జాబితా రూపొందించాలని ఆదేశాలు. 2023 మార్చి 29 తేదీ నాటికి ముగియనున్న , ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి వై శ్రీనివాసుల రెడ్డి పదవీ కాలం ముగుస్తుంది. అలాగే, కడప- అనంతపురం-కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి వై గోపాల్ రెడ్డి పదవీ కాలం ముగియబోతోంది.
శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ నేత పీవీఎన్ మాధవ్ పదవీ కాలం ముగియబోతోంది. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి విఠపు బాలసుబ్రమణ్యం పదవీ కాలం ముగుస్తుంది. కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి కత్తి నర్సింహారెడ్డి పదవీ కాలం ముగియనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రులు, టీచర్ల ఓటర్ల నమోదు ప్రక్రియపై అధికారులు ఫోకస్ పెట్టనున్నారు.
Read Also: PM Convoy: కాన్వాయ్ ఆపి.. అంబులెన్స్కు దారిచ్చిన ప్రధాని మోదీ
తాజావార్తలు
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..