Graduates, Teacher Mlc Voters: పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ షురూ
ఏపీలో పట్టభద్రులు- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది ఎన్నికల సంఘం. 2023 మార్చి 29 తేదీన ఐదుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగుస్తుండటంతో ఓటర్ల నమోదు ప్రక్రియ షెడ్యూల్ ప్రకటన విడుదలైంది. 2022 అక్టోబరు 1 తేదీ నుంచి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు బహిరంగ ప్రకటన జారీ చేయాలని ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు జారీ అయ్యాయి. 2022 నవంబరు 7 తేదీ నుంచి ఫాం 18 ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని సూచనలు అందాయి.
Read Also: Kireeti Reddy: ‘జూనియర్’గా జనం ముందుకు గాలి జనార్దన్ రెడ్డి తనయుడు!
Also Read
2022 నవంబరు 23 తేదీ నాటికి ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించాలని స్పష్టం చేసింది. 2022 డిసెంబర్ 30 తేదీనాటికి ఓటర్ల తుది జాబితా రూపొందించాలని ఆదేశాలు. 2023 మార్చి 29 తేదీ నాటికి ముగియనున్న , ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి వై శ్రీనివాసుల రెడ్డి పదవీ కాలం ముగుస్తుంది. అలాగే, కడప- అనంతపురం-కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి వై గోపాల్ రెడ్డి పదవీ కాలం ముగియబోతోంది.
శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ నేత పీవీఎన్ మాధవ్ పదవీ కాలం ముగియబోతోంది. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి విఠపు బాలసుబ్రమణ్యం పదవీ కాలం ముగుస్తుంది. కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి కత్తి నర్సింహారెడ్డి పదవీ కాలం ముగియనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రులు, టీచర్ల ఓటర్ల నమోదు ప్రక్రియపై అధికారులు ఫోకస్ పెట్టనున్నారు.
Read Also: PM Convoy: కాన్వాయ్ ఆపి.. అంబులెన్స్కు దారిచ్చిన ప్రధాని మోదీ
తాజావార్తలు
-
New OTT Rules 2026 : ఓటీటీలో కొత్త రూల్స్.. నిర్మాతలకు ‘షాక్’.. వసూళ్లు లేకపోతే రైట్స్ కట్!
-
Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు
-
న్యూ లుక్లో YS Jagan.. యూరప్ టూర్కు బయల్దేరిన మాజీ సీఎం.!
-
Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్, తాజా అప్డేట్ ఇదే!
-
Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!